నాకు నరేంద్ర మోడీ పాఠాలు... ఏం చేయకూడదో నేర్పారు : రాహుల్

Webdunia
బుధవారం, 12 డిశెంబరు 2018 (11:46 IST)
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ స్పందించారు. ఈ ఫలితాలు చాలా సంతృప్తిగా ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం మెరుగైన ఫలితాలను ఎదురుచూశామని తెలిపారు. మంగళవారం రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మిజోరం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. ఇందులో మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయభేరీ మోగించింది. ఈ ఫలితాలపై రాహుల్ స్పందించారు. 
 
తాను 2014 లోక్‌సభ ఎన్నికల ఓటమి నుంచి ఎంతో నేర్చుకున్నానని వెల్లడించారు. ప్రధాని మోడీకి అవినీతితో సంబంధం ఉందని ప్రజలు నమ్మారని వ్యాఖ్యానించారు. ఇక మోడీకి ఎన్నికలు చాలా కష్టంగా మారిపోయాయని స్పష్టమైందని తెలిపారు. గత ఎన్నికల్లో ఉద్యోగకల్పన, అవినీతి నిర్మూలన తదితర హామీలతో మోడీ విజయం సాధించారని, ఇప్పుడు ఆ భ్రమలు తొలగిపోయాయన్నారు. 
 
'2014 ఎన్నికలు నాకు చాలా మంచి చేశాయని అమ్మతో చెప్పాను. వాటి నుంచి చాలా నేర్చుకున్నాను. ముఖ్యంగా వినయం నేర్చుకున్నాను. నిజానికి నరేంద్ర మోడీనే నాకు పాఠం నేర్పించారు. ఏం చెయ్యకూడదో ఆయన చెప్పారు. మోడీకి ప్రజలు గొప్ప అవకాశం ఇచ్చారు. కానీ ప్రజల గుండెచప్పుడు ఆయన వినలేకపోవడం చాలా బాధాకరం' అని వ్యాఖ్యానించారు. మూడు రాష్ట్రాల్లో విజయం సాధించడంపై రాహుల్‌ పార్టీ కార్యకర్తలను ప్రశంసించారు. పార్టీ విజయం వారిదేనని, వారు సింహాలని వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments