Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంతకంతకూ పెరిగిపోతున్న ప్రధాని మోడీ పాపులారిటీ!!

వరుణ్
సోమవారం, 15 జులై 2024 (09:12 IST)
సోషల్ మీడియాలోనే కాకుండా, పలు దేశాల్లోనూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాప్యులారిటీ అంతకంతకూ పెరిగిపోతుంది. ఎలాంటి సోషల్ మీడియా ప్లాట్ ఫాం అయినప్పటికీ మోడీ ఫాలోవర్ల సంఖ్య భారీగానే ఉంటుంది. తాజాగా ఆయన ఎక్స్‌లో రికార్డు సృష్టించారు. తన ట్విట్టర్ ఖాతాను ఫాలో అయ్యే వారి సంఖ్య 10 కోట్ల మార్కును అధిగమించారు. దీంతో ఎక్స్‌లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన ప్రపంచ నేతగా అవతరించారు. దీనిపై ప్రధాని మోడీ సంతోషం వ్యక్తం చేశారు.
 
'నా ఫాలోవర్ల సంఖ్య వంద మిలియన్లు దాటిపోయింది. ఎక్స్ వంటి చురుకైన మాధ్యమంలో ఉండడం, చర్చలు, ఆలోచనలు పంచుకోవడం, ప్రజల ఆశీస్సులు, నిర్మాణాత్మక విమర్శలు... ఇలా ఎన్నో ఈ వేదిక ద్వారా పొందగలుగుతున్నందుకు సంతోషంగా ఉంది' అంటూ ట్వీట్ చేశారు.
 
ఇక, భారత్‌లో విపక్ష నేత రాహుల్ గాంధీ 'ఎక్స్' ఫాలోవర్ల సంఖ్య 26.4 మిలియన్లు కాగా... ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ కు 27.5 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే... ఇండియా కూటమిలోని నేతలందరి ఎక్స్ ఫాలోవర్లను కలిపితే 9.5 కోట్లు కాగా... ప్రధాని మోడీ ఒక్కరే 10 కోట్లతో టాప్‌లో నిలవడం విశేషం. అలాగే, అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను కూడా ఆయన అధికమించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

Breakfast: స్కూల్స్‌కు వెళ్లే పిల్లలు బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే.. ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments