Webdunia - Bharat's app for daily news and videos

Install App

కారు ప్రమాదంలో చిక్కిన ప్రధాని సతీమణి: ఒకరు మృతి.. ఎవరు?

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సతీమణి జశోదాబెన్ ప్రమాదానికి గురైయ్యారు. రాజస్థాన్‌లోని చిత్తూరుకు సమీపంలో యశోదాబెన్ ప్రయాణిస్తున్న కారును ట్రక్ ఢీకొంది. ఈ ఘటనలో జశోదాబెన్ స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఈ ఘటనపై

Webdunia
బుధవారం, 7 ఫిబ్రవరి 2018 (12:43 IST)
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సతీమణి జశోదాబెన్ ప్రమాదానికి గురైయ్యారు. రాజస్థాన్‌లోని చిత్తూరుకు సమీపంలో యశోదాబెన్ ప్రయాణిస్తున్న కారును ట్రక్ ఢీకొంది. ఈ ఘటనలో జశోదాబెన్ స్వల్పగాయాలతో బయటపడ్డారు.

ఈ ఘటనపై పోలీసులు స్పందిస్తూ.. యశోదాబెన్ ఈ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారని.. ఆమెకు ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. 
 
ఈ ప్రమాదం కోట-చిత్తూర్ హైవేలో చిట్టోర్‌ఘర్‌కు 55 కిలోమీటర్ల దూరంలో చోటుచేసుకుంది. అయితే ఏడుగురు ఇనోవా కారులో వెళ్తుండగా, ట్రక్ ఢీకొనడంతో యశోదాబెన్ బంధువైన బసంత్ భాయ్ తీవ్రగాయాలతో అక్కడికక్కడే మరణించారు.

డ్రైవర్‌తో పాటు మిగిలిన వారు గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. యశోదాబెన్ కుటుంబీకులు అట్రు నుంచి గుజరాత్‌కు ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments