Webdunia - Bharat's app for daily news and videos

Install App

బురదలో కూరుకునిపోయిన ప్రధాని ఎస్కార్ట్ హెలికాఫ్టర్

Webdunia
మంగళవారం, 2 మే 2023 (20:18 IST)
కర్నాటక ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఈ నెల 10వ తేదీన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. దీంతో ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఈ ప్రచారం కోసం రాజకీయ నేతలు హెలికాఫ్టర్లను వినియోగిస్తున్నారు. ఇలాంటి వారిలో ప్రధాని మోడీ సైతం ఉన్నారు. అయితే, ఆయన ప్రచారంలో ఓ అపశృతి చోటు చేసుకుంది. ఆయన ఎస్కార్ హెలికాఫ్టర్ బురదలో కూరుకుని పోయింది. ఆ హెలికాప్టర్ ల్యాండైన ప్రదేశం చిత్తడి ఉండడంతో ఈ పరిస్థితి ఎదురైంది. 
 
కర్నాటక రాష్ట్రంలోని రాయచూర్ జిల్లా సింధనూరు వద్ద ఓ సభలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ వచ్చారు. హోసళ్లి క్యాంపు సమీపంలోని ఓ వరిపొలంలో హెలిప్యాడ్ ఏర్పాటుచేశారు. కానీ ఆ పొలం ఇంకా చిత్తడిగానే ఉండడంతో, ల్యాండైన హెలికాప్టర్ మళ్లీ గాల్లోకి లేవలేకపోయింది. దాంతో, ఓ జేసీబీ, 100 మంది మనుషుల సాయంతో హెలికాప్టర్‌ను బురద నుంచి బయటికి తీసుకువచ్చారు. సెక్యూరిటీ సిబ్బంది తప్పిదం వల్లే ప్రధాని మోడీ ఎస్కార్ట్ హెలికాప్టర్‌‌కు ప్రమాదం ఎదురైందని భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mahesh Babu: రేపటి నుంచి ఒరిస్సా లో రాజమౌళి, మహేశ్‌బాబు సినిమా షూటింగ్‌ - తాజా అప్ డేట్

విజయ్ దేవరకొండతో రౌడీ జనార్ధన, నితిన్ తో ఎల్లమ్మ లైన్ లో ఉన్నాయి

మా పౌరుషం సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది: దర్శకుడు షెరాజ్ మెహ్ది

అఖిల్ అక్కినేని న‌టించిన ఏజెంట్ మూవీ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్

రాజమండ్రి లో జయప్రద సోదరుడు రాజబాబు అస్థికల నిమజ్జనం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?

Dry Fish: ఎండుచేపలు ఎవరు తినకూడదు.. మహిళలు తింటే అంత మేలా?

Dry Fruits: పెరుగులో డ్రై ఫ్రూట్స్ కలిపి పిల్లలకు ఇవ్వడం చేస్తే?

మహిళలు రోజూ గంట సేపు వాకింగ్ చేస్తే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments