Webdunia - Bharat's app for daily news and videos

Install App

లడఖ్‌కు కేంద్రం వరాలు - కేంద్ర వర్శిటీ.. బౌద్ధ అధ్యయన కేంద్రం

Webdunia
శుక్రవారం, 24 జులై 2020 (10:14 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తిని కల్పించే 370 ఆర్టికల్‌ను ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ సర్కారు రద్దు చేసింది. ఆ తర్వాత లడఖ్ ప్రాంతాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించింది. అంటే లడఖ్ ఏర్పడి ఒక యేడాది అయింది. 
 
ఈ సందర్భంగా ప్రధాని మోడీ ఓ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానికి హోమ్ శాఖ మంత్రి అమిత్ షాతో పాటు విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన లడఖ్‌కు వరాలు కురిపించారు. 
 
లడఖ్‌లో తొలి కేంద్ర విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. ఓ బౌద్ధ అధ్యయన కేంద్రం ఏర్పాటుకుకానుంది. ఈ యూనివర్శిటీలో ఇంజనీరింగ్, మెడిసిన్ మినహా మిగతా అన్ని బేసిక్ సైన్సెస్ తదితర కోర్సుల్లో డిగ్రీలను అందిస్తుంది. 
 
ఇక ఈ వర్శిటీ ఏర్పాటుపై కేంద్ర మానవ వనరుల శాఖ త్వరలోనే అధికారికంగా ప్రతిపాదన తెస్తుందని, ఆపై క్యాబినెట్ ఆమోదం తర్వాత బిల్లు పార్లమెంట్ మందుకు వస్తుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 

సంబంధిత వార్తలు

'కంగువ'లో 10,000 మంది పాల్గొనే వార్ సీక్వెన్స్

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments