Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీకి మూడు రాజధానులు ఓ కల : పవన్ కళ్యాణ్

Webdunia
శుక్రవారం, 24 జులై 2020 (09:44 IST)
ఏపీకి మూడు రాజధానుల అంశంపై జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ తాజాగా స్పందించారు. మూడు రాజధానుల అంశం ఓ కలేనని చెప్పుకొచ్చారు. అధికారంలోకి వస్తే పరిపాలన వికేంద్రీకరణ పేరిట మూడు రాజధానులు చేస్తామని వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చెప్పి ఉండాల్సిందని తెలిపారు. అప్పుడు రాజధాని అమరావతికి రైతులు అన్ని వేల ఎకరాలు భూమి ఇచ్చేవారు కాదేమోనని అభిప్రాయపడ్డారు. 
 
ఇప్పుడు అధికారంలోకి వచ్చాక రకరకాల కారణాలు చెప్పి రాజధాని మారుస్తామనడం రైతులను వంచించడమే మంచిది కాదు. వారితో ఎవరైనా కన్నీరు పెట్టిస్తే అది మలమల మాడ్చేస్తుంది అని హెచ్చరించారు. రాజధాని రైతులకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. ‘గతంలో టీడీపీ నాయకులు సింగపూర్‌ తరహా రాజధాని అని చెప్పి కాన్సెప్ట్‌ ఎలా అమ్మారో.. ఈ అధికార వికేంద్రీకరణ కూడా మరో కాన్సెప్ట్‌ అమ్మడమే. ప్రజలకు ఒక కల చూపడం తప్ప వాస్తవంలో అవేవీ రూపుదాల్చవు అని చెప్పుకొచ్చారు. 
 
ఇకపోతే, విపక్ష టీడీపీ, అధికార వైసీపీ ఆధిపత్య పోరులో రైతులు నలిగిపోతున్నారన్నారు. రాజధానిగా అమరావతిని ఆనాడు అందరూ అంగీకరించారని గుర్తుచేశారు. 200 రోజులకుపైగా పోలీసు వ్యవస్థతో రైతులపై దాడులు జరిపించి.. ఆడవాళ్లు, చిన్న పిల్లలు అని లేకుండా.. విద్యార్థులు, వృద్ధులని లేకుండా లాఠీలతో కొట్టించారని, ఆ పాపం పాలకులకు ఊరికేపోదని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నితిన్, శ్రీలీల నటించిన రాబిన్ హుడ్ చిత్రం రివ్యూ

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments