Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ కురువృద్ధుల ఆశీర్వాదాలు తీసుకున్న కాబోయే ప్రధాని మోడీ!!

వరుణ్
శుక్రవారం, 7 జూన్ 2024 (18:24 IST)
ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ మరోమారు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనను ఎన్డీయే కూటమి నేతగా శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఆ కూటమి భాగస్వామ్య పార్టీల సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆ తర్వాత ఆయన బీజేపీ కురువృద్ధులను కలుసుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని రాష్ట్రపతిని ద్రౌపది ముర్మును కోరనున్నారు. 
 
ఇందుకోసం రాష్ట్రపతి వద్దకు వెళ్లడానికి ముందు నరేంద్ర మోడీ బీజేపీ కురువృద్ధులు ఎల్కే.అద్వానీ, మురళీ మనోహర్ జోషిలను కలుసుకున్నారు. అలాగే, మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌ను కూడా ఆయన కలుసుకుని ఆశీర్వాదం తీసుకున్నారు. 
 
తొలుత బీజేపీ అగ్రనేత ఎల్కే.అద్వానీ నివాసానికి వెళ్లిన మోడీ... ఆ తర్వాత మురళీ మనోహర్ జోషి నివానికి, ఆ పిమ్మట రాంనాథ్ కోవింగ్ నివాసాలకు వెళ్లారు. ఇదిలావుంటే, ఈ నెల 9వ తేదీన సాయంత్రం 6 గంటలకు దేశ ప్రధానిగా ఆయన మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుమ్మడికాయ కొట్టిన గేమ్ ఛేంజర్ - ఫ్యాన్స్ ఫిదా

అదే ఫీల్డ్ లో వర్క్ చేయడం ఆనందంగా వుంది : డార్లింగ్ ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి ఫీల్ ఆఫ్ బడ్డీ రిలీజ్

ప్రేక్షకుల మధ్య విజయ్ ఆంటోనీ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ ఇంట్రడక్షన్

మిస్టర్ బచ్చన్ లో రవితేజ, భాగ్యశ్రీ బోర్సే పై సితార్ సాంగ్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments