Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రులతో కలిసి సినిమా చూసిన ప్రధానమంత్రి మోడీ!!

ఠాగూర్
మంగళవారం, 3 డిశెంబరు 2024 (09:15 IST)
దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సినిమా చూశారు. తన మంత్రివర్గంలోని మంత్రులతో కలిసి ఆయన ఈ చిత్రాన్ని వీక్షించారు. ఆ చిత్రం పేరు ది సబర్మతి రిపోర్టు. పార్లమెంట్ ప్రాంగణంలోని థియేటర్‌‍లో వారు ఈ చిత్రాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ స్పందిస్తూ, సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యే రీతిలో వాస్తవాలు వెలుగులోకి వస్తున్నందుకు సంతోషంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. 
 
గుజరాత్ రాష్ట్రంలో గత 2002లో జరిగిన గోద్రా రైలు దహనకాండ దేశాన్ని కలచివేసిన విషయం తెలిసిందే. ఆ దుర్ఘటనలో 59 మంది ప్రయాణీకులు ప్రాణాలు కోల్పోయారు. ఆ గుజరాత్ అల్లర్లు, గోద్రా రైలు దహనకాండ ఆధారంగా బాలీవుడ్ దర్శకుడు ధీరజ్ సర్నా 'ది సబర్మతి రిపోర్టు' సినిమాను తెరకెక్కించారు.
 
విక్రాంత్ మాస్కే, రాశీఖన్నా ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించారు. రిధి డోగ్రా కీలక పాత్ర పోషించారు. నవంబరు 15వ తేదీన ఈ సినిమా విడుదలైంది. కాగా, పార్లమెంట్ ప్రాంగణంలో కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ ఇతర మంత్రులు, ఎంపీలతో కలిసి ప్రధాని మోడీ ఈ చిత్రాన్ని వీక్షించారు. 
 
కాగా, ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని చూడాలంటూ సోషల్ మీడియాలో చేసిన పోస్టుకు ప్రధాని మోడీ స్పందించారు. కల్పిత కథనాలు పరిమిత కాలమే కొనసాగుతాయని, సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో వాస్తవాలు వెలుగులోకి వస్తున్నందుకు సంతోషంగా ఉందని సినిమా చూసిన తర్వాత ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలాంటి పాత్రలు చేయను.. అవసరమైతే ఆంటీగా నటిస్తా : టాలీవుడ్ నటి

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments