Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ రాజధాని అమరావతికి మళ్లీ ఊపిరి - త్వరలో పనులు ప్రారంభం...

ఠాగూర్
మంగళవారం, 3 డిశెంబరు 2024 (08:56 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మళ్లీ ఊపిరి వచ్చింది. రాజధాని నిర్మాణ పనులను తిరిగి ప్రారంభంకానున్నాయి. ఇందుకోసం ఏపీ సర్కారు రూ.11467 కోట్లను కేటాయించింది. మొత్తం 23 అంశాలకు క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ - సీఆర్డీయే ఆమోదం తెలిపింది. ఈ నిధులతో రోడ్లు, రిజర్వాయర్ల నిర్మాణం, అధికారుల నివాస భవనాల నిర్మాణాలను చేపట్టనున్నారు. 
 
ఇందులోభాగంగా, తొలి దశలో రూ.11,467 కోట్లతో వివిధ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు సీఆర్డీయే ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన సోమవారం ఉండవల్లిలోని ఆయన నివాసంలో సీఆర్డీయే అథారిటీ 41వ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మొత్తం 23 అంశాలకు అథారిటీ ఆమోదం తెలిపింది. వీటిలో చాలా వరకు పనులను ప్రపంచబ్యాంకు, ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు సహకారంతో చేపడతారు.
 
మొత్తం రూ.11,467 కోట్లలో రూ.2,498 కోట్లతో కొన్ని ప్రధాన రహదారుల పనులు చేపట్టగా, రూ.1,585 కోట్లతో పాలవాగు, కొండవీటి వాగు, గ్రావిటేషన్ కాల్వల అభివృద్ధి, మూడు రిజర్వాయర్లు నిర్మిస్తారు. అలాగే, రూ.3,525 కోట్లతో అఖిల భారత సర్వీసుల అధికారులు, గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారులు, నాలుగో తరగతి ఉద్యోగుల నివాస భవన నిర్మాణాలను పూర్తిచేస్తారు. 
 
రూ.3,859 కోట్లతో భూసేకరణలో భూములిచ్చిన రైతులకు కేటాయించిన స్థలాల లేఅవుట్ల అభివృద్ధి పనులను కొనసాగిస్తారు. అలాగే, 2019కి ముందున్న టెండర్లు రద్దు చేసి కొత్త ఎస్ఎస్ఆర్ ధరల ప్రకారం ఈ పనులకు మళ్లీ టెండర్లు పిలుస్తారు. అమరావతిలో హ్యాపీనెస్ట్ ప్రాజెక్టుకు రూ.948.10 కోట్ల సవరించిన అంచనాలతో కొత్తగా టెండర్లు పిలుస్తారు. ప్రాజెక్టు ఆలస్యం కావడం వల్ల సీఆర్డీయే నష్టపోయే రూ.270.71 కోట్లను ప్రభుత్వం చెల్లిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

Akhil Akkineni: జైనాబ్ రావ్జీతో అఖిల్ అక్కినేని వివాహం.. ఫోటోలు, వీడియో క్లిప్‌లు వైరల్

రోడ్డు ప్రమాదంలో 'దసరా' మూవీ విలన్ తండ్రి దుర్మరణం

రూ.21 కోట్లు వడ్డీతో చెల్లించండి.. విశాల్‌కు హైకోర్టు ఆదేశం

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments