Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశ వ్యాప్తంగా రైతు బంధు పథకం : ప్రధాని మోడీ యోచన

Webdunia
సోమవారం, 14 జనవరి 2019 (17:58 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఆలోచన చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. రైతులు, ఇతర అల్పాదాయ వర్గాలకు చెందిన ప్రజలకు ఆర్థిక సహాయం (నగదు బదిలీ) చేసేందుకు వీలుగా ఈ తరహా పథకాలను ప్రవేశపెట్టాలన్న భావనలో ప్రధాని ఉన్నట్టు తెలుస్తోంది. 
 
కష్టాలు, అప్పుల ఊబిలో ఉన్న రైతులను ఆదుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టారు. ముఖ్యంగా, ఒక్కో ఎకరానికి రూ.4 వేలు చొప్పున ఆర్థిక సాయం చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవసాయ పెట్టుబడి సాయంగా అందజేస్తున్నారు. పైగా, ఈ మొత్తం తిరిగి చెల్లించనక్కర్లేదు.
 
ఇదేవిధంగానే ప్రధాని నరేంద్ర మోడీ కూడా అమలు చేయాలని భావిస్తున్నారు. రెండు మూడు నెలల్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రైతులను తమవైపునకు ఆకర్షించేందుకు వీలుగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. అయితే, ఈ పథకానికి భారీగా ఆర్థిక నిధులు అవసరం కనుక ఆ మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంచుకొనే అవకాశాలు పరిశీలనలో ఉన్నాయి. ఈ పథకంపై ప్రస్తుతం వ్యవసాయ మంత్రిత్వశాఖ, ఆర్థిక శాఖ, నీతి ఆయోగ్ చర్చలు జరుపుతున్నాయి. ప్రభుత్వం రైతుల ఆర్థిక సాయం కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించే ఆలోచన చేస్తోంది. ఇందుకయ్యే వ్యయం, విధివిధానాలు ఖరారయ్యాక త్వరలోనే ఈ పథకాన్ని ప్రకటించే అవకాశం ఉంది. 
 
వ్యవసాయ భూమి కలిగిన రైతులకు యేడాదికి ఎకరాకు రూ.4 వేలు నగదు నేరుగా బ్యాంకు ఖాతాలోకి బదిలీ చేయాలనే ప్రతిపాదన పరిశీలనలో ఉన్నట్టు కొన్ని అధికార వర్గాల ద్వారా తెలిసింది. అయితే, ఇది రైతులందరికీ వర్తింపజేయాలా లేక సన్నకారు, చిన్నకారు, మధ్య తరహా రైతులకే పరిమితం చేయాలా అనే విషయంపై తర్జనభర్జనలు పడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న రైతుబంధు పథకం (వ్యవసాయ భూమి ఉన్న రైతులకు ఏడాదికి రూ.8,000 నగదు) తరహాలో ఉంటుంది. తెలంగాణ రైతు బంధుని ఒడిషా, జార్ఖండ్ రాష్ట్రాలు కూడా అమలు చేస్తున్న విషయం తెల్సిందే.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments