Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌కు చేరుకున్న ప్రధాని మోడీ - యూపీ సీఎంతో విందు

Webdunia
మంగళవారం, 17 మే 2022 (08:14 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేపట్టిన ఒక్క రోజు నేపాల్ పర్యటన ముగించుకుని తిరిగి స్వదేశానికి చేరుకున్నారు. బుద్ధ పూర్ణిమ సందర్భంగా లుంబినిలోని మాయాదేవి ఆలయంలో నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవ్ బాతో కలిసి మోడీ ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత మోడీ, దేవ్‌ల సమక్షంలో భారత్, నేపాల్ దేశాల ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య ఆరు అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. 
 
ఈ సందర్భంగా ప్రధాని మోడీ ప్రసంగిస్తూ, నేపాల్‌కు రాముడికి విడదీయరాని సంబంధం ఉందన్నారు. నేపాల్ లేకుంటే రాముడు అసంపూర్ణం అని వ్యాఖ్యానించారు. అయితే, బుద్ధుడు ఇరు దేశాలను కలుపుతున్నాడని, బుద్ధుడు రాజకీయ సరిహద్దులకు అతీతుడని, బుద్ధుడు ప్రతి ఒక్కరి వాడని చెప్పారు. 
 
ఇదిలావుంటే నేపాల్ పర్యటన ముగించుకున్న ప్రధాని మోడీ లక్నోకు చేరుకున్నారు. అక్కడ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగినాథ్‌తో కలిసి విందులో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆ రాష్ట్ర మంత్రులతో రాష్ట్ర పాలనపై చర్చించారు. ఆ తర్వాత యూపీ మంత్రివర్గంతో కలిసి ఆయన గ్రూపు ఫోటో దిగారు. కాగా, యూపీలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన తర్వాత ప్రధాని మోడీ ఆ రాష్ట్రంలో పర్యటించడం ఇది రెండోసారి కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఖైరతాబాద్ గణేషుని సమక్షంలో తల్లాడ కె.పి.హెచ్.బి. కాలనీలో చిత్రం

Lavanya Tripathi : టన్నెల్ ట్రైలర్ లో లావణ్య త్రిపాఠి, అధర్వ మురళీ కాంబో అదిరింది

మదరాసి చేయడం వల్ల చాలా విషయాలు నేర్చుకున్నా : శివకార్తికేయన్

Ram: ఆంధ్రా కింగ్ తాలూకా లో ఫస్ట్ డే ఫస్ట్ షో జరుపుకుంటున్న అభిమానిగా రామ్

లిటిల్ హార్ట్స్ డైరెక్టర్ బిర్యానీ చేస్తే నేను కొత్తిమీర చల్లాను : మౌళి తనుజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

జాతీయ పోషకాహార మాసం: మీ రోజువారీ పోషణను బాదం ఎలా మెరుగుపరుస్తుంది?

Lotus Root: తామర పువ్వు వేర్లను సూప్స్‌, సలాడ్స్‌లో ఉపయోగిస్తే?

తర్వాతి కథనం
Show comments