Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌కు చేరుకున్న ప్రధాని మోడీ - యూపీ సీఎంతో విందు

Webdunia
మంగళవారం, 17 మే 2022 (08:14 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేపట్టిన ఒక్క రోజు నేపాల్ పర్యటన ముగించుకుని తిరిగి స్వదేశానికి చేరుకున్నారు. బుద్ధ పూర్ణిమ సందర్భంగా లుంబినిలోని మాయాదేవి ఆలయంలో నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవ్ బాతో కలిసి మోడీ ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత మోడీ, దేవ్‌ల సమక్షంలో భారత్, నేపాల్ దేశాల ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య ఆరు అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. 
 
ఈ సందర్భంగా ప్రధాని మోడీ ప్రసంగిస్తూ, నేపాల్‌కు రాముడికి విడదీయరాని సంబంధం ఉందన్నారు. నేపాల్ లేకుంటే రాముడు అసంపూర్ణం అని వ్యాఖ్యానించారు. అయితే, బుద్ధుడు ఇరు దేశాలను కలుపుతున్నాడని, బుద్ధుడు రాజకీయ సరిహద్దులకు అతీతుడని, బుద్ధుడు ప్రతి ఒక్కరి వాడని చెప్పారు. 
 
ఇదిలావుంటే నేపాల్ పర్యటన ముగించుకున్న ప్రధాని మోడీ లక్నోకు చేరుకున్నారు. అక్కడ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగినాథ్‌తో కలిసి విందులో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆ రాష్ట్ర మంత్రులతో రాష్ట్ర పాలనపై చర్చించారు. ఆ తర్వాత యూపీ మంత్రివర్గంతో కలిసి ఆయన గ్రూపు ఫోటో దిగారు. కాగా, యూపీలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన తర్వాత ప్రధాని మోడీ ఆ రాష్ట్రంలో పర్యటించడం ఇది రెండోసారి కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments