Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత రత్న ప్రచారం ఆపండి ప్లీజ్: రతన్ టాటా విజ్ఞప్తి

Webdunia
శనివారం, 6 ఫిబ్రవరి 2021 (21:13 IST)
తనకు ‘భారత రత్న’ ఇవ్వాలంటూ జరుగుతున్న ప్రచారంను ఆపాలని పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా కోరారు. 100 బిలియన్ డాలర్ల విలువైన టాటా గ్రూప్ చైర్మన్ ఎమిరిటస్ రతన్ టాటాకు ‘భారత రత్న’ ఇవ్వాలని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. దీనిపై రతన్ టాటా శనివారం ట్విటర్ వేదికగా స్పందించారు. 
 
‘‘ఓ అవార్డు గురించి సోషల్ మీడియాలో ఓ సెక్షన్ వ్యక్తం చేసిన సెంటిమెంట్స్‌ను నేను అర్థం చేసుకున్నాను. అయితే ఈ ప్రచారాలను నిలిపేయాలని వినయపూర్వకంగా కోరుతున్నాను. భారతీయుడిని కావడం, భారత దేశ అభివృద్ధి, సౌభాగ్యాల కోసం కృషి చేయడం  నా అదృష్టంగా భావిస్తున్నాను’’ అని రతన్ టాటా ట్వీట్ చేశారు. 
 
‘భారత రత్న ఫర్ రతన్ టాటా’ హ్యాష్‌ట్యాగ్‌తో జరుగుతున్న ప్రచారంపై రతన్ టాటా స్పందిస్తూ ఈ ట్వీట్ చేశారు. దీనిపై కూడా యూజర్లు స్పందిస్తూ, ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇటువంటి వ్యక్తిత్వం ఉన్నందువల్లే తమకు ఆయన ఎల్లప్పుడూ ప్రత్యేకంగా నిలుస్తున్నారని పేర్కొంటున్నారు. టాటా గ్రూప్ మన దేశానికి సాటిలేని సేవలందిస్తోందని చెప్తున్నారు. 
 
రతన్ టాటా 2012లో టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి వైదొలగారు. అప్పటి నుంచి ఆయన వ్యక్తిగత హోదాలో యువతను ప్రోత్సహిస్తున్నారు. స్టార్టప్‌ కంపెనీలను ఏర్పాటు చేసేవారిని ప్రోత్సహిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments