Webdunia - Bharat's app for daily news and videos

Install App

పబ్‌జీ వ్యసనం.. రైలు వస్తున్నా పట్టించుకోలేదు.. వేగంగా వచ్చిన రైలు..?

Webdunia
మంగళవారం, 19 మార్చి 2019 (15:19 IST)
పబ్‌జీ వ్యసనంలో పడి ఇద్దరు యువకులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. హింగోలిలోని ఖట్‌కలి బైపాస్‌ సమీపంలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే, నగేశ్‌ గోరి(24), స్వప్నిల్ అన్నపూర్ణె (22) అనే యువకులు హింగోలికి సమీపంలో ఉన్న రైలు పట్టాల వద్ద పబ్జీ గేమ్ ఆడుకుంటున్నారు. గేమ్ మాయలో పడి చుట్టు ప్రక్కల జరుగుతున్నవి గమనించలేదు. 
 
రైలు వస్తున్న విషయం కూడా తెలుసుకోలేకపోయారు. ఆ సమయంలో అటు నుండి వేగంగా వస్తున్న హైదరాబాద్‌- అజ్మేర్‌ రైలు వీరిని ఢీకొట్టింది. యువకులు ఇద్దరూ అక్కడికక్కకే మరణించారు. కొన్ని గంటల తర్వాత స్థానికులు మృత దేహాలను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. 
 
ఇటీవల కాలంలో బాగా ప్రాచూర్యం పొందిన పబ్జీ గేమ్ వల్ల అనేక మంది పిల్లల ప్రవర్తన మారిపోతోందని, చివరికి ప్రాణాలు కూడా గాలిలో కలిసిపోతున్నాయని, దానిని వెంటనే నిషేధించాలని కొంత మంది తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments