Webdunia - Bharat's app for daily news and videos

Install App

నల్లధనానికి కేరాఫ్ అడ్రస్‌గా రూ.2 వేల నోటు : బీజేపీ నేత సుశీల్ కుమార్ మోడీ

Webdunia
మంగళవారం, 13 డిశెంబరు 2022 (09:33 IST)
నల్లధనానికి రూ.2 వేల రూపాయల నోటు కేరాఫ్ అడ్రస్‌గా మారిందని, అందువల్ల ఆ నోటును తొలగించాలని బీజేపీ నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సుశీల్ కుమార్ మోడీ అన్నారు. అందువల్ల ఆ నోటును రద్దు చేయాలని సూచించారు. 
 
పార్లమెంట్ సమావేశాల్లోభాగంగా సోమవార జీరో అవర్‌లో ఆయన మాట్లాడుతూ, కొందరు రూ.2 వేల నోట్లుదాచిపెట్టుకుని అక్రమాలకు వినియోగించుకుంటున్నారని ఆరోపించారు. ఏటీఎంలలో కూడా రూ.2 వేల నోటు కనిపించడంలేదని అన్నారు. ఈ నోట్లను తీసుకుని రావడంలో ఎలాంటి హేతుబద్ధత లేదన్నారు. అందువల్ల ఈ నోటును చెలామణి నుంచి రద్దు చేయాలని ఆయన కోరారు.
 
అయితే, రూ.2 వేల నోట్లను ఇప్పటికిప్పుడు నిలిపివేయడం కూడా సరికాదన్నారు. దశల వారీగా వాటి చెలామణి నుంచి తొలగించాలని కోరారు. మన దేశంలో డిజిటల్ లావాదేవీలు పెరిగాయన్నారు. అందువల్ల రూ.2 వేల వంటి పెద్ద కరెన్సీ నోట్ల అవసరం చాలా తక్కువ అని సుశీల్ కుమార్ మోడీ అన్నారు. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments