నల్లధనానికి కేరాఫ్ అడ్రస్‌గా రూ.2 వేల నోటు : బీజేపీ నేత సుశీల్ కుమార్ మోడీ

Webdunia
మంగళవారం, 13 డిశెంబరు 2022 (09:33 IST)
నల్లధనానికి రూ.2 వేల రూపాయల నోటు కేరాఫ్ అడ్రస్‌గా మారిందని, అందువల్ల ఆ నోటును తొలగించాలని బీజేపీ నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సుశీల్ కుమార్ మోడీ అన్నారు. అందువల్ల ఆ నోటును రద్దు చేయాలని సూచించారు. 
 
పార్లమెంట్ సమావేశాల్లోభాగంగా సోమవార జీరో అవర్‌లో ఆయన మాట్లాడుతూ, కొందరు రూ.2 వేల నోట్లుదాచిపెట్టుకుని అక్రమాలకు వినియోగించుకుంటున్నారని ఆరోపించారు. ఏటీఎంలలో కూడా రూ.2 వేల నోటు కనిపించడంలేదని అన్నారు. ఈ నోట్లను తీసుకుని రావడంలో ఎలాంటి హేతుబద్ధత లేదన్నారు. అందువల్ల ఈ నోటును చెలామణి నుంచి రద్దు చేయాలని ఆయన కోరారు.
 
అయితే, రూ.2 వేల నోట్లను ఇప్పటికిప్పుడు నిలిపివేయడం కూడా సరికాదన్నారు. దశల వారీగా వాటి చెలామణి నుంచి తొలగించాలని కోరారు. మన దేశంలో డిజిటల్ లావాదేవీలు పెరిగాయన్నారు. అందువల్ల రూ.2 వేల వంటి పెద్ద కరెన్సీ నోట్ల అవసరం చాలా తక్కువ అని సుశీల్ కుమార్ మోడీ అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

Ratika: రతిక ప్రధాన పాత్రలో ఎక్స్ వై డిఫరెంట్ పోస్టర్‌

Spirit : ప్రభాస్.. స్పిరిట్ నుంచి సౌండ్ స్టోరీ ప్రోమో - రవితేజ, త్రివిక్రమ్ వారసులు ఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments