Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్రీగా చికెన్ ఇవ్వలేదంటూ కోళ్లను చంపేశారు.. ఎక్కడ...?

Webdunia
సోమవారం, 1 జులై 2019 (18:39 IST)
ఇంట్లో పెంచుకుంటున్న కోళ్లను ఫ్రీగా ఇవ్వలేదని ఇద్దరు దుండగులు కోళ్లను చంపేశారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఆదివారం నాడు చోటుచేసుకుంది.


ఝాన్సీ రోడ్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో గుడ్డి భాయ్‌ అనే మహిళ తన కుమార్తెతో నివసిస్తూ జీవనాధారం కోసం కూలీగా పని చేస్తోంది. కూలీ డబ్బులతో ఇంటి అవసరాలు తీరకపోయే సరికి ఇంటి వద్దనే నాలుగైదు కోళ్లను పెంచుకుంటుంది. 
 
కోళ్లు పెట్టిన గుడ్లను అమ్ముకొని.. ఆ డబ్బుతో చిన్న చిన్న అవసరాలు తీర్చుకుంటుంది. ఆదివారం ఉదయం గుడ్డి భాయ్‌ ఇంట్లో లేని సమయంలో ఇద్దరు వ్యక్తులు ఆమె ఇంటికి వచ్చి, ఫ్రీగా ఓ కోడిని ఇవ్వాలని ఆమె కూతురిని కోరారు. ఆమె తిరస్కరించంతో కోపగించుకున్న ఆ ఇద్దరు వ్యక్తులు అక్కడున్న ఒక కోడి పుంజును చంపేశారు. మిగతా నాలుగు కోళ్లకు విషాహారం తినిపించారు. 
 
దీంతో ఒకేసారి ఐదు కోళ్లు చనిపోయాయి. చివరకు ఇంటికి చేరుకున్న గుడ్డి భాయ్ చనిపోయిన కోళ్లను తీసుకొని ఝాన్సీ రోడ్‌ పోలీసు స్టేషన్‌కు వెళ్లింది‌. కోళ్లను చంపేసిన సురేందర్‌, సుమర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments