Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంపన్న మహిళకు బెదిరింపులు.. రూ.2కోట్లు ఇవ్వకపోతే.. ఆ ఫోటోలను పోర్నోగ్రాఫిక్ సైట్లలో?

మహిళలపై అఘాయిత్యాలు, వేధింపులు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా భోపాల్‌లో ఓ మహిళ తీవ్ర వేధింపులకు గురైంది. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ జిల్లాలో ఓ 30 ఏళ్ల మహిళను గుర్తుతెలియని వ్యక్తులు బెదిరించి క్యాష్ చే

Webdunia
శుక్రవారం, 2 డిశెంబరు 2016 (10:04 IST)
మహిళలపై అఘాయిత్యాలు, వేధింపులు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా భోపాల్‌లో ఓ మహిళ తీవ్ర వేధింపులకు గురైంది. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ జిల్లాలో ఓ 30 ఏళ్ల మహిళను గుర్తుతెలియని వ్యక్తులు బెదిరించి క్యాష్ చేసుకోవాలనుకున్నారు. బిట్‌కాయిన్ల రూపంలో 2 కోట్ల రూపాయలు చెల్లించాలని, లేకపోతే ఆమె ఫొటోలను వరుసపెట్టి పోర్నోగ్రాఫిక్ సైట్లలో పెడుతూనే ఉంటామని ఈ-మెయిల్ ద్వారా హెచ్చరించారు. దీనిపై ఆ మహిళ ధైర్యం చేసి పోలీసులు ఫిర్యాదు చేసింది.
 
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సదరు మహిళకు వచ్చిన ఈమెయిల్స్ అన్నీ ఫిలిప్పీన్స్ నుంచి వచ్చినట్లు గుర్తించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని జబల్పూర్ ఎస్పీ ఆశిష్ తెలిపారు.
 
ఓపెద్ద కుటుంబానికి చెందిన ఆ మహిళ.. ఈ తరహా ఈమెయిల్ రావడంతో ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. ఆమె వ్యక్తిగత సమాచారం, నగ్న ఫొటోలు అన్నింటినీ ఆమె సోషల్ మీడియా కాంటాక్టులకు, కుటుంబ సభ్యులకు, స్నేహితులకు చేరవేయడంతో పాటు పోర్న్ సైట్లలో కూడా పెడతామని హ్యాకర్లు హెచ్చరించారు. నిందితులు టీఓఆర్ బ్రౌజర్లు వాడటం వల్ల వాళ్ల సెర్వర్లు ఎక్కడున్నాయో గుర్తించడం కష్టమని కేసుపై దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు చెప్పారు. 

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం