Webdunia - Bharat's app for daily news and videos

Install App

నమ్మి హోటల్‌కు వెళ్లిన యువతి... సామూహిక అఘాయిత్యం

Webdunia
శుక్రవారం, 9 జులై 2021 (15:41 IST)
తన స్నేహితుల మాటలు నమ్మి హోటల్‌కు వెళ్లిన ఓ మైనర్ బాలికపై ఇద్దరు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నాలో వెలుగు చూసింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, రాష్ట్రంలోని పాటలీపుత్ర ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల బాలికకు సోషల్ మీడియా ద్వారా పర్వేజ్, రంజాన్ అనే ఇద్దరు యువకులు పరిచయమయ్యారు. ఆ ఇద్దరితో సదరు బాలిక తరచుగా ఛాటింగ్ చేసేది. 
 
కొద్ది రోజులకు ఫోన్ ద్వారా మాటలు కలిపింది. ముగ్గురూ తరచుగా మొబైల్ ద్వారా మాట్లాడుకునేవారు. గురువారం వారిద్దరూ ఓయో ద్వారా పాట్నాలో హోటల్ రూమ్ బుక్ చేసి సదరు బాలికను అక్కడకు రమ్మన్నారు. సరదాగా మాట్లాడుకుందామని పిలిచారు. 
 
వారి మాటలు నమ్మి అక్కడకు వెళ్లిన ఆ బాలికపై వారు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన అనంతరం ఆ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆ బాలికకు వైద్య పరీక్షలు చేయించి, ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేశారు. 
 
ఇద్దరు నిందితులపై కూడా పోలీసులు పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అయితే, ఈ విషయం తెలిసిన బాధితురాలి తల్లిదండ్రులు.. బాలికను తీవ్రంగా కొట్టి గాయపచరిచారు. వారికి కూడా పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లంచ‌గొండుల‌పై సేనాప‌తి స్వైర విహారం భారతీయుడు 2’ ట్రైలర్

శాపనార్థాలు పెట్టిన రేణూ దేశాయ్.. వారికి చెడు కర్మ ఖచ్చితం... ఎవరికి?

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments