ఎయిరిండియా విమానంలో ప్రయాణికుల ముక్కుల నుంచి రక్తం... ఎందుకంటే?

Webdunia
సోమవారం, 11 ఫిబ్రవరి 2019 (15:23 IST)
ఎయిరిండియా సంస్థకు చెందిన ఓ విమానం ప్రయాణికులకు చుక్కలు చూపించింది. క్యాబిన్‌లో పీడన సమస్య కారణంగా ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు అస్వస్థతకు గురయ్యారు. మస్కట్ నుండి కాలికట్ బయల్దేరిన విమానంలో పీడనం తగ్గడంతో కొందరు ప్రయాణికులకు ముక్కు నుండి రక్తస్రావం కాగా, మరికొంత మంది చెవి నొప్పితో బాధపడ్డారు. 
 
185 మంది ప్రయాణికులు, సిబ్బందితో పాటుగా ఆదివారం మస్కట్ ఎయిర్‌పోర్ట్ నుండి కాలికట్ బయల్దేరిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అందులోని ప్రయాణికులు అస్వస్థతకు గురికావడంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే మస్కట్ ఎయిర్‌పోర్టుకు దారి మళ్లించారు. 
 
ప్రయాణికులలో నలుగురికి ముక్కు నుంచి రక్తస్రావం కాగా, మరికొంత మంది చెవి నొప్పితో ఇబ్బందిపడ్డారు. వారందరికీ విమానాశ్రయంలో చికిత్స అందించారు. వారు కోలుకున్న తర్వాత విమానం కాలికట్ బయల్దేరింది. ప్రయాణికులలో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నట్లు అధికారులు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas-Anushka Wedding: ప్రభాస్ - అనుష్కల వివాహం.. ఏఐ వీడియో వైరల్.. పంతులుగా ఆర్జీవీ

Boyapati Srinu: ఇక్కడ కులాలు లేవు మతాలు లేవు. ఉన్నదంతా మంచి చెప్పడమే : బోయపాటి శ్రీను

Balakrishna:చరిత్రని సృష్టించేవాడు ఒకడే ఉంటాడు. నేనే ఈ చరిత్ర: నందమూరి బాలకృష్ణ

మరో 100 జన్మలైనా.. రజనీకాంత్‌లాగే పుట్టాలనుకుంటున్నా... తలైవర్ భావోద్వేగం

Akhil Raj: అఖిల్ రాజ్ హీరోగా సతీష్ గోగాడ దర్శకత్వంలో అర్జునుడి గీతోపదేశం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments