Webdunia - Bharat's app for daily news and videos

Install App

విగ్గులో 5 కేజీల బంగారం అక్రమ రవాణా.. ఎలా?

Webdunia
సోమవారం, 22 మార్చి 2021 (08:56 IST)
చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమ స్మగ్లింగ్ గుట్టును కస్టమ్స్ అధికారులు రట్టు చేశారు. నెత్తిపై ధరించిన విగ్గులో దాచి ఏకంగా ఐదు కేజీల బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న వైనాన్ని కనిపెట్టారు. ఈ కేసులో ఏడుగురు వ్యక్తులను కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. 
 
ఆదివారం జరిగిన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, ఆదివారం దుబాయ్, షార్జా నుంచి రెండు ప్రత్యేక విమానాలు చెన్నై చేరుకున్నాయి. అందులో వచ్చిన ప్రయాణికుల్లో కొందరి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో కస్టమ్స్ అధికారులు ప్రతి ఒక్క ప్రయాణికుడిని తనిఖీ చేశారు. 
 
ఈ తనిఖీల్లో ఓ వ్యక్తి తలకు ధరించిన విగ్గుపై అనుమానం కలిగింది. దీంతో ఆ విగ్గును తీసుకుని నిశితంగా పరిశీలించారు. ఇందులో బంగారం పేస్ట్, ముడి బంగారం దాచిన విషయం గుర్తించారు. మొత్తం ఐదు కేజీల మేరకు ఈ బంగారం ఉంటుంది. దీని మొత్తం విలువ రూ.2.53 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. 
 
అలాగే, అదే సమయంలో చెన్నై నుంచి షార్జాకు అక్రమంగా తీసుకెళ్లేందుకు తెచ్చిన రూ.24 లక్షల విలువైన విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఈ రెండు కేసుల్లో చెన్నై, తిరుచ్చి, రామనాథపురం, విళుపురం, సేలం జిల్లాలకు చెందిన ఏడుగురుతో సహా మొత్తం 11 మందిని అరెస్టు చేశారు. వీరిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments