Webdunia - Bharat's app for daily news and videos

Install App

విగ్గులో 5 కేజీల బంగారం అక్రమ రవాణా.. ఎలా?

Webdunia
సోమవారం, 22 మార్చి 2021 (08:56 IST)
చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమ స్మగ్లింగ్ గుట్టును కస్టమ్స్ అధికారులు రట్టు చేశారు. నెత్తిపై ధరించిన విగ్గులో దాచి ఏకంగా ఐదు కేజీల బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న వైనాన్ని కనిపెట్టారు. ఈ కేసులో ఏడుగురు వ్యక్తులను కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. 
 
ఆదివారం జరిగిన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, ఆదివారం దుబాయ్, షార్జా నుంచి రెండు ప్రత్యేక విమానాలు చెన్నై చేరుకున్నాయి. అందులో వచ్చిన ప్రయాణికుల్లో కొందరి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో కస్టమ్స్ అధికారులు ప్రతి ఒక్క ప్రయాణికుడిని తనిఖీ చేశారు. 
 
ఈ తనిఖీల్లో ఓ వ్యక్తి తలకు ధరించిన విగ్గుపై అనుమానం కలిగింది. దీంతో ఆ విగ్గును తీసుకుని నిశితంగా పరిశీలించారు. ఇందులో బంగారం పేస్ట్, ముడి బంగారం దాచిన విషయం గుర్తించారు. మొత్తం ఐదు కేజీల మేరకు ఈ బంగారం ఉంటుంది. దీని మొత్తం విలువ రూ.2.53 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. 
 
అలాగే, అదే సమయంలో చెన్నై నుంచి షార్జాకు అక్రమంగా తీసుకెళ్లేందుకు తెచ్చిన రూ.24 లక్షల విలువైన విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఈ రెండు కేసుల్లో చెన్నై, తిరుచ్చి, రామనాథపురం, విళుపురం, సేలం జిల్లాలకు చెందిన ఏడుగురుతో సహా మొత్తం 11 మందిని అరెస్టు చేశారు. వీరిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రూబా లో సరికొత్త ప్రేమ కథను చూస్తారు - దర్శకుడు విశ్వ కరుణ్

Vijayashanti: కళ్యాణ్ రామ్, విజయశాంతి మూవీ టైటిల్ అర్జున్ S/O వైజయంతి

Rukshar Dhillon: హాపీ ఉమన్స్ డే గా నటి రుక్సార్ ధిల్లాన్ ఘాటు విమర్శలు

దర్శకులు మెచ్చుకున్న 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో చిత్రం.. ఫుల్ ఫన్ రైడ్

సమాజంలో మార్పుకే కీప్ ది ఫైర్ అలైవ్ ఫిల్మ్ తీసాం : చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Extra Marital Affair: వివాహేతర సంబంధాలకు కారణాలు ఏంటి? సైకలాజిస్టులు ఏం చెప్తున్నారు?

Tandoori Chicken Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ తందూరి చికెన్ ఈజీగా ఎలా చేయాలి?

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments