Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ నుంచి లక్నోకు బయలుదేరిన విమానం... గగనతలంలో ప్రయాణికుడు మృతి!!

ఠాగూర్
శుక్రవారం, 21 మార్చి 2025 (12:03 IST)
ఢిల్లీ నుంచి లక్నోకు బయలుదేరిన ఎయిరిండియా విమానంలో ఓ ప్రయాణికుడు గగనతలంలో మృతి చెందాడు. ఢిల్లీ నుంచి బయలుదేరిన ఈ విమానం... శుక్రవారం ఉదయం 8.10 గంటలకు లక్నోలోని చరణ్ సింగ్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయింది. ప్రయాణికులు విమానం దిగుతున్న సమయంలో సీట్లు శుభ్రం చేస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది ఓ ప్రయాణికుడు వద్దకు వెళ్లగా, అతడిలో ఎలాంటి చలనం లేకపోవడాన్ని గమనించి విమాన సిబ్బందికి సమాచారం చేరవేశాడు. దీంతో విమానంలో ఉన్న వైద్యులు అతడిని పరీక్షించగా మృతి చెందినట్టు ధృవీకరించారు. 
 
సిబ్బంది వెంటనే అధికారులకు సమాచారం అందించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మృతుడిని ఢిల్లీకి చెందిన ఆసఫ్ ఉల్హా అన్సారీగా గుర్తించినట్టు అధికారులు వెల్లడించారు. విమానం ఎక్కిన తర్వాత అతడికి ఇచ్చిన ఆహార పదార్థాలు అలానే ఉండటం, సీటు బెల్టు కూడా తీయకపోవడంతో గాల్లో ఉన్న సమయంలో మృతి ేచెందివుంటాడని అనుమానిస్తున్నారు. అతడు మృతి చెందడానికి గల కారణాలు తెలియరాలేదని, మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపామని తెలిపారు. అతడి కుటుంబ సభ్యులకు అధికారులు సమాచారం చేరవేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

Sreeleela: జూనియర్ ఎన్టీఆర్‌ను చూసి ముచ్చటపడిన శ్రీలీల తల్లి స్వర్ణలత

Amani: ఒగ్గు కళాకారుల నేపథ్యం లో తెరకెక్కిన బ్రహ్మాండ చిత్రం

బార్బరిక్ షూటింగ్‌లో ప్రతీ రోజూ ఛాలెంజింగ్‌గా అనిపించేది : వశిష్ట ఎన్ సింహా

హర హర శంకర పాటలో సమాజంలో ఘోరాల్ని చూపించారు : తనికెళ్ళ భరణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments