Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవంబర్​ 18 నుంచి పార్లమెంట్​ శీతాకాల సమావేశాలు..!

Webdunia
గురువారం, 17 అక్టోబరు 2019 (13:40 IST)
నవంబర్​ 18 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ నేతృత్వంలో బుధవారం జరిగిన పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్​ కమిటీ(సీసీపీఏ) సమావేశంలో ఈ అంశంపై చర్చించారు. నవంబర్​ 18న నుంచి డిసెంబర్​ 13 వరకు సమావేశాలు సాగనున్నట్లు తెసుస్తోంది.
 
అయితే, అధికారికంగా ఎలాంటి షెడ్యూల్​ వెల్లడికానప్పటికీ దాదాపు ఇవే తేదీలు ఖరారయ్యే అవకాశముంది. గతేడాది పార్లమెంట్​ వింటర్​ సెషన్​ 2018 డిసెంబర్​ 11వ తేదీన ప్రారంభమై 2019 జనవరి 8వ తేదీ వరకు కొనసాగింది. ఈ ఏడాదిలో నిర్వహించిన సార్వత్రిక ఎన్నికలకు ముందు పూర్తి కాలం జరిగిన సెషన్​ అదే.
 
సభ జరగనున్న కాలం, సెషన్​ సిట్టింగ్​లపై వచ్చే వారం జరగనున్న కేబినెట్​ భేటీ అనంతరం.. అధికారికంగా ప్రకటించనున్నారు. అదే సమయంలో పార్లమెంట్​ ఉభయసభల్లో చర్చించాల్సిన అంశాలపై కార్యాచరణ రూపొందించనున్నారు.
 
ఆర్డినెన్స్​లు చట్టాలుగా...!
ఈ సమావేశాల్లో రెండు కీలక అత్యవసరాదేశాలను చట్టంగా రూపొందించాలని చూస్తోంది భాజపా. ముఖ్యంగా మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను ఎదుర్కొనేందుకు తీసుకొచ్చిన ఆర్డినెన్స్​... 'దేశీయ కంపెనీలకు కార్పొరేట్​ పన్ను తగ్గింపు'ను చట్టంగా మార్చాలని భావిస్తోంది. ఎలక్ట్రానిక్​ సిగరెట్ల ఉత్పత్తి, అమ్మకం, దిగుమతి నిషేధంపై జారీ చేసిన ఆర్డినెన్స్​నూ చట్టంగా రూపొందించే అవకాశముంది. మరిన్ని కీలక బిల్లులను ఈ శీతాకాల సమావేశాల్లోనే ఆమోదింపజేసుకోవాలని చూస్తోంది ఎన్డీఏ ప్రభుత్వం.

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments