Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత రాజ్యాంగానికి వయసు 7 పదులు.. 26న ప్రత్యేక పార్లమెంట్

Webdunia
బుధవారం, 6 నవంబరు 2019 (17:21 IST)
భారత రాజ్యాంగానికి 70 యేళ్లు నిండనున్నాయి. దీన్ని పురస్కరించుకుని ఈ నెల 26వ తేదీన భారత పార్లమెంట్ ప్రత్యేకంగా సమావేశంకానుంది. ఈ సందర్భంగా రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్‌, ప్ర‌ధాని నరేంద్ర మోడీలు ఎంపీల‌ను ఉద్దేశించి మాట్లాడుతారు. 
 
ఈ ప్రత్యేక సమావేశాలకు ఉప రాష్ట్ర‌ప‌తి, రాజ్యసభ ఛైర్మెన్ వెంక‌య్య‌నాయుడు, లోక్‌సభ స్పీక‌ర్ ఓం బిర్లాలు కూడా సంయుక్త స‌మావేశాల‌కు హాజ‌ర‌వుతారు. మాజీ రాష్ట్ర‌ప‌తులు, ప్ర‌ధానులు కూడా ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన‌నున్నారు. 
 
ఉభయ సభల సమావేశం పార్ల‌మెంట్ సెంట్ర‌ల్ హాలులో జరుగనుంది. స్వాతంత్య్రం వ‌చ్చి 50 ఏళ్లు నిండిన సంద‌ర్భంలోనూ 1997లో అర్థ‌రాత్రి ప్ర‌త్యేక స‌మావేశాలు నిర్వ‌హించారు. 1949, న‌వంబ‌ర్ 26వ తేదీన భార‌త రాజ్యాంగాన్ని ఆమోదించారు. 1950, జ‌న‌వ‌రి 26 నుంచి రాజ్యాంగం అమ‌లులోకి వ‌చ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments