Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీకి వ్యతిరేకంగా పార్టీలన్నీ ఏకంకావాలి : ఉద్ధవ్ ఠాక్రే

ఎన్డీయే భాగస్వామ్య పార్టీల్లో ఒకటైన శివసేన కూడా భారతీయ జనతా పార్టీపై తిరుగుబాటు బావుటా ఎగురవేసింది. బీజేపీకి వ్యతిరేకంగా దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ఏకంకావాలంటూ ఆ పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే పిలుపు

Webdunia
గురువారం, 31 మే 2018 (18:41 IST)
ఎన్డీయే భాగస్వామ్య పార్టీల్లో ఒకటైన శివసేన కూడా భారతీయ జనతా పార్టీపై తిరుగుబాటు బావుటా ఎగురవేసింది. బీజేపీకి వ్యతిరేకంగా దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ఏకంకావాలంటూ ఆ పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే పిలుపునిచ్చారు.
 
గురువారం వెల్లడైన ఉప ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన ముంబైలో విలేకరులతో మాట్లాడుతూ, మన దేశంలో ప్రజాస్వామ్యం అంతమైందన్నారు. ఎలక్షన్‌ కమిషన్‌లోనూ అవినీతి కనపడుతోందని, ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను నియమించడం ఆపేసి, ఓట్ల పద్ధతిలో ఎన్నుకుంటే బాగుంటుందన్నారు. 
 
ముఖ్యంగా బీజేపీయేతర పార్టీలన్నీ ఒక తాటిపైకి రావాలని, ఈసీకి వ్యతిరేకంగా కోర్టులో ఫిర్యాదు చేయాలని అన్నారు. తమ రాష్ట్రంలోని పాల్‌ఘర్‌ లోక్‌సభ స్థానంలో ఎన్నికల కౌంటింగ్‌లో వ్యత్యాసాలు వచ్చాయని, ఎందుకు అలా జరుగుతోందో తెలిసే వరకు ఫలితాలు వెల్లడించకూడదని డిమాండ్‌ చేశారు. 
 
కాగా, ఎన్నికల ఫలితాలను వెల్లడించకూడదని శివసేన చేసిన డిమాండ్‌ను ఎన్నికల కమిషన్ తిరస్కరించింది. పాల్ఘర్‌లో జరిగిన లోక్‌సభ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రాజేంద్ర గావిట్‌ గెలిచినట్లు ప్రకటించి ఆయనకు ధృవీకరణ పత్రాన్ని అందజేసింది. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments