Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీకి వ్యతిరేకంగా పార్టీలన్నీ ఏకంకావాలి : ఉద్ధవ్ ఠాక్రే

ఎన్డీయే భాగస్వామ్య పార్టీల్లో ఒకటైన శివసేన కూడా భారతీయ జనతా పార్టీపై తిరుగుబాటు బావుటా ఎగురవేసింది. బీజేపీకి వ్యతిరేకంగా దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ఏకంకావాలంటూ ఆ పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే పిలుపు

Webdunia
గురువారం, 31 మే 2018 (18:41 IST)
ఎన్డీయే భాగస్వామ్య పార్టీల్లో ఒకటైన శివసేన కూడా భారతీయ జనతా పార్టీపై తిరుగుబాటు బావుటా ఎగురవేసింది. బీజేపీకి వ్యతిరేకంగా దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ఏకంకావాలంటూ ఆ పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే పిలుపునిచ్చారు.
 
గురువారం వెల్లడైన ఉప ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన ముంబైలో విలేకరులతో మాట్లాడుతూ, మన దేశంలో ప్రజాస్వామ్యం అంతమైందన్నారు. ఎలక్షన్‌ కమిషన్‌లోనూ అవినీతి కనపడుతోందని, ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను నియమించడం ఆపేసి, ఓట్ల పద్ధతిలో ఎన్నుకుంటే బాగుంటుందన్నారు. 
 
ముఖ్యంగా బీజేపీయేతర పార్టీలన్నీ ఒక తాటిపైకి రావాలని, ఈసీకి వ్యతిరేకంగా కోర్టులో ఫిర్యాదు చేయాలని అన్నారు. తమ రాష్ట్రంలోని పాల్‌ఘర్‌ లోక్‌సభ స్థానంలో ఎన్నికల కౌంటింగ్‌లో వ్యత్యాసాలు వచ్చాయని, ఎందుకు అలా జరుగుతోందో తెలిసే వరకు ఫలితాలు వెల్లడించకూడదని డిమాండ్‌ చేశారు. 
 
కాగా, ఎన్నికల ఫలితాలను వెల్లడించకూడదని శివసేన చేసిన డిమాండ్‌ను ఎన్నికల కమిషన్ తిరస్కరించింది. పాల్ఘర్‌లో జరిగిన లోక్‌సభ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రాజేంద్ర గావిట్‌ గెలిచినట్లు ప్రకటించి ఆయనకు ధృవీకరణ పత్రాన్ని అందజేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

Vaibhavam : అవ్యాజ్యమైన అమ్మ ప్రేమ తో వైభవం సిద్ధమైంది

మొదటి చాన్స్ ఇచ్చిన దర్శకుడితో ఎస్ సినిమా చేయడం హ్యాపీ : విజయ్ సేతుపతి

వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments