Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేలం పాటల్లో నిమ్మకాయకు రూ.5 లక్షల ధర ... ప్రత్యేక ఏంటో తెలుసా?

ఠాగూర్
సోమవారం, 17 ఫిబ్రవరి 2025 (12:21 IST)
దేశంలోని ప్రసిద్ధ ఆలయాల్లో పళని మురుగన్ ఆలయం ఒకటి. ఈ ఆలయంలో పళని ఏటా మూడు రోజులపాటు తైపూస ఉత్సవాలు జరుగుతాయి. ఈ వేడుకల సందర్భంగా స్వామివారి పాదాల చెంత నిమ్మకాయలు ఉంచుతారు. ఈ నిమ్మకాయలను సొంతం చేసుకునేందుకు భక్తులు పోటీపడుతున్నారు. ఈ వేలం పాటల్లో ఒక్క నిమ్మకాయను రూ.5 లక్షల ధర చెల్లించి దక్కించుకున్నారు. 
 
తాజాగా నిర్వహించిన ఈ వేలం పాటల్లో పుదుక్కోటై జిల్లా తిరుమంగళం వల్లనాట్టు చెట్టియార్ వర్గీయులు పళనిలో ఏటా మూజు రోజుల పాటు తైపూస వేడుకలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఉదయం, మధ్యాహ్నం, రాత్రి అన్నదానం కూడా చేస్తారు. ఈ క్రమంలో స్వామి పాదాల వద్ద ఒక్కో నిమ్మకాయ పెట్టి పూజ చేస్తుంటారు. 
 
తాజాగా వాటిని వేలం వేయగా ఒక్కో నిమ్మకాయ రూ.16 వేల నుంచి రూ.40 వేల వరకు ధర పలికింది. తైపూసం రోజున మురుగన్ అభిషేకం సమయంలో స్వామివారి పాదాల వద్ద ఉంచిన నిమ్మకాయను మాత్రం ఓ భక్తుడు రూ.5.09 లక్షలకు సొంతం చేసుకున్నాడు. ఈ వేలం వల్లనాట్లు చెట్టియార్ మాత్రమే పాల్గొంటారు. స్వామి వారి పాదాల వద్ద ఉంచిన నిమ్మకాయ తమ వద్దే ఉంటే శుభం జరుగుతుదని భక్తులు విశ్వాసం. అందుకే పూజలో పెట్టే నిమ్మకాయలను సొంతం చేసుకునేందుకు భక్తులు పోటీపడుతుంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

తెలుగురాని అమ్మాయిలను బాగా ప్రేమిస్తాం... ఎంకరేజే చేస్తాం : నిర్మాత ఎస్‌కేఎన్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments