Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేలం పాటల్లో నిమ్మకాయకు రూ.5 లక్షల ధర ... ప్రత్యేక ఏంటో తెలుసా?

ఠాగూర్
సోమవారం, 17 ఫిబ్రవరి 2025 (12:21 IST)
దేశంలోని ప్రసిద్ధ ఆలయాల్లో పళని మురుగన్ ఆలయం ఒకటి. ఈ ఆలయంలో పళని ఏటా మూడు రోజులపాటు తైపూస ఉత్సవాలు జరుగుతాయి. ఈ వేడుకల సందర్భంగా స్వామివారి పాదాల చెంత నిమ్మకాయలు ఉంచుతారు. ఈ నిమ్మకాయలను సొంతం చేసుకునేందుకు భక్తులు పోటీపడుతున్నారు. ఈ వేలం పాటల్లో ఒక్క నిమ్మకాయను రూ.5 లక్షల ధర చెల్లించి దక్కించుకున్నారు. 
 
తాజాగా నిర్వహించిన ఈ వేలం పాటల్లో పుదుక్కోటై జిల్లా తిరుమంగళం వల్లనాట్టు చెట్టియార్ వర్గీయులు పళనిలో ఏటా మూజు రోజుల పాటు తైపూస వేడుకలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఉదయం, మధ్యాహ్నం, రాత్రి అన్నదానం కూడా చేస్తారు. ఈ క్రమంలో స్వామి పాదాల వద్ద ఒక్కో నిమ్మకాయ పెట్టి పూజ చేస్తుంటారు. 
 
తాజాగా వాటిని వేలం వేయగా ఒక్కో నిమ్మకాయ రూ.16 వేల నుంచి రూ.40 వేల వరకు ధర పలికింది. తైపూసం రోజున మురుగన్ అభిషేకం సమయంలో స్వామివారి పాదాల వద్ద ఉంచిన నిమ్మకాయను మాత్రం ఓ భక్తుడు రూ.5.09 లక్షలకు సొంతం చేసుకున్నాడు. ఈ వేలం వల్లనాట్లు చెట్టియార్ మాత్రమే పాల్గొంటారు. స్వామి వారి పాదాల వద్ద ఉంచిన నిమ్మకాయ తమ వద్దే ఉంటే శుభం జరుగుతుదని భక్తులు విశ్వాసం. అందుకే పూజలో పెట్టే నిమ్మకాయలను సొంతం చేసుకునేందుకు భక్తులు పోటీపడుతుంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఖైరతాబాద్ గణేషుని సమక్షంలో తల్లాడ కె.పి.హెచ్.బి. కాలనీలో చిత్రం

Lavanya Tripathi : టన్నెల్ ట్రైలర్ లో లావణ్య త్రిపాఠి, అధర్వ మురళీ కాంబో అదిరింది

మదరాసి చేయడం వల్ల చాలా విషయాలు నేర్చుకున్నా : శివకార్తికేయన్

Ram: ఆంధ్రా కింగ్ తాలూకా లో ఫస్ట్ డే ఫస్ట్ షో జరుపుకుంటున్న అభిమానిగా రామ్

లిటిల్ హార్ట్స్ డైరెక్టర్ బిర్యానీ చేస్తే నేను కొత్తిమీర చల్లాను : మౌళి తనుజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

జాతీయ పోషకాహార మాసం: మీ రోజువారీ పోషణను బాదం ఎలా మెరుగుపరుస్తుంది?

Lotus Root: తామర పువ్వు వేర్లను సూప్స్‌, సలాడ్స్‌లో ఉపయోగిస్తే?

తర్వాతి కథనం
Show comments