Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Pawan Kalyan: పళనిలో పవన్ కల్యాణ్.. తిరుపతి-పళనికి బస్సు సర్వీసులు పునఃప్రారంభం (video)

Advertiesment
Pawan At Palani

సెల్వి

, శుక్రవారం, 14 ఫిబ్రవరి 2025 (16:07 IST)
Pawan At Palani
దేశంతో పాటు ప్రజల శ్రేయస్సు కోసం తమిళనాడు పళని దండాయుధ పాణి స్వామిని ప్రార్థించానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. పళని నుండి తిరుపతికి రోజువారీ రైలు సర్వీసు కోసం ప్రజలు చేసిన అభ్యర్థనపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించిన తర్వాత చర్యలు తీసుకుంటామని, ఆంధ్రప్రదేశ్ రవాణా సంస్థ అధికారులతో చర్చించిన తర్వాత పళని-తిరుపతి బస్సు సర్వీసును పునఃప్రారంభించడానికి చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, నటుడు పవన్ కళ్యాణ్ అన్నారు. 
 
ఏపీ సీఎం పవన్ కళ్యాణ్ తమిళనాడులోని ముఖ్యమైన దేవాలయాల ఆధ్యాత్మిక పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా మధురైలోని తిరుపరంకుండ్రం కుమార స్వామిని దర్శించుకున్నాక.. పళని కొండపై వెలసిన వేలాయుధ స్వామి ఆలయాన్ని సందర్శించారు.
 
రోప్‌వే ద్వారా కొండ ఆలయానికి వెళ్లిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు ఆలయ నిర్వాహకులు పూర్తి కుంభ స్వాగతం పలికారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్, ఆయన కుమారుడు అకిరా నందన్ ప్రత్యేక పూజల అనంతరం స్వామి దేవుడిని దర్శనం చేసుకున్నారు. దీని తర్వాత, అర్చకులు పవన్ కళ్యాణ్‌కు ఆలయ ప్రసాదాలు అందజేశారు. 
webdunia
Pawan At Palani
 
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ విలేకరులతో మాట్లాడుతూ, "తమిళనాడులో నేను చేపట్టిన ఆధ్యాత్మిక ప్రయాణం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. దేశం, ప్రజలు బాగుండాలని నేను ఎల్లప్పుడూ దేవుడిని ప్రార్థిస్తున్నాను. ఇంకా పళని నుండి తిరుపతి ఆలయానికి ప్రతిరోజూ బస్సు నడపబడుతుందని, రైలు సర్వీసు కోసం కేంద్రం మాట్లాడతాం.." అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆపిల్ ఫ్యామిలీ నుంచి మరో కొత్త ఫోన్.. విడుదల ఎపుడంటే?