Webdunia - Bharat's app for daily news and videos

Install App

రగిలిపోతున్న పాకిస్థాన్.. సరుకుల్లో విష ప్రయోగం.. జాగ్రత్త అవసరం..

Webdunia
శనివారం, 2 మార్చి 2019 (13:13 IST)
భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తత నేపథ్యంలో పాకిస్థాన్ కొత్త ప్లాన్ వేసే అవకాశం వుందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. పాకిస్థాన్ నుంచి అభినందన్‌ను అంతర్జాతీయ సమాజం నుంచి ఒత్తిడి తీసుకొచ్చి విడిపించడం.. పాకిస్థాన్‌ను ఏకాకి చేయడంతో ఆ దేశం అంతర్గతంగా రగిలిపోతుంది. ఇందుకు ప్రతీకారంగా జమ్మూకాశ్మీర్‌లో విధులు నిర్వర్తించే జవాన్ల నిత్యావసర సరుకుల్లో విష ప్రయోగం చేయాలని ప్రణాళిక రచించినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయి. 
 
ఈ పన్నాగాన్ని పాకిస్థాన్ మిలిటరీ ఇంటెలిజెన్స్, ఐఎస్ఐ పాటుపడే అవకాశం ఉందని.. సరుకులు పంపిణీ చేసే సమయంలో ఒకటికి, రెండుసార్లు చూసుకోవాలని సంబంధిత అధికారులకు స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే.. దాయాది పాకిస్థాన్ వైఖరి మారదనేందుకు ఈ ఘటనే నిదర్శనం. పాక్‌లో చిక్కిన పైలట్ అభినందన్‌ను అప్పగించిన కొన్ని గంటల్లోనే సరిహద్దుల్లో తూటాలు పేల్చింది. 
 
దీంతో ముగ్గురు పౌరులు మృతిచెందారు. వీరిని రుబానా కోసర్, ఆమె కుమారుడు సోన ఫజాన్, 9 నెలల నెలల పాప షాబ్నాంగా గుర్తించారు. ఈ కాల్పుల్లో మరొకరు గాయపడినట్టు భద్రతా సిబ్బంది పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments