Webdunia - Bharat's app for daily news and videos

Install App

హనుమంతుడికి తనలోని శక్తి తెలియదు.. పాక్‌కు మన ఆర్మీ శక్తిని తెలిపాను: మనోహర్ పారికర్

పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోకి చొచ్చుకుని వెళ్లి అక్కడ ఉన్న ఉగ్రవాద శిబిరాలపై భారత జవాన్లు మెరుపుదాడి జరపడంపై భారత రక్షణ మంత్రి మనోహర్ పారీకర్ ప్రశంసించారు. భారత ఆర్మీ జరిపిన సర్జికల్ దాడులపై ఆయన స్పందిస్

Webdunia
శనివారం, 1 అక్టోబరు 2016 (16:28 IST)
పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోకి చొచ్చుకుని వెళ్లి అక్కడ ఉన్న ఉగ్రవాద శిబిరాలపై భారత జవాన్లు మెరుపుదాడి జరపడంపై భారత రక్షణ మంత్రి మనోహర్ పారీకర్ ప్రశంసించారు. భారత ఆర్మీ జరిపిన సర్జికల్ దాడులపై ఆయన స్పందిస్తూ రామాయణంలోని హనుమంతుడిని గుర్తు చేశారు. సీతాన్వేషణ కోసం శ్రీలంకకు వెళ్లేముందు హ‌నుమంతుడికి త‌నలో ఉన్న శ‌క్తి ఏంటో తెలియదని, అనంత‌రం తెలిసింద‌ని చెప్పారు. 
 
అలాగే, రామాయ‌ణాన్ని గుర్తు చేసిన మ‌నోహ‌ర్ పారిక‌ర్ శ్రీరాముడు లంకపై యుద్ధం చేసి గెలిచాడ‌ని, అనంత‌రం ఆ ప్రాంతాన్ని విభిషణుడికి ఇచ్చాడని అన్నారు. భార‌త్ గ‌తంలో బంగ్లాదేశ్‌ విషయంలోనూ అదే చేసింద‌ని గుర్తుచేస్తారు. అందువల్ల భారత్ ఇన్నాళ్లూ పాటిస్తూ వ‌చ్చిన శాంతిని మ‌న‌ బలహీనతగా పాకిస్థాన్‌ భావించకూడాదని పారికర్ అన్నారు. 
 
భారత్‌కు హాని చేయాల‌ని చూస్తే వారికి తగిన బుద్ధి చెప్పితీరుతామ‌ని అన్నారు. తాము ఏ దేశంపై కూడా దాడి చేసి విధ్వంసం సృష్టించాల‌ని కోరుకోవ‌డం లేద‌ని అన్నారు. ఎవరికీ హాని తలపెట్టాలని కోరుకోని తాము ఎవరైనా హాని చేస్తే మాత్రం దీటైన జ‌వాబే ఇస్తామ‌ని పారికర్ హెచ్చరించారు. మన సైన్యం జరిపిన దాడులతో పాకిస్థాన్ సర్కారు కోమాలోకి వెళ్లిందని ఎద్దేవా చేశారు. 

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

విక్రాంత్, చాందినీ చౌదరి జంటకు సంతాన ప్రాప్తిరస్తు

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments