Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుల్‌భూషణ్‌కు ఊరట.. అప్పీల్ చేసుకునే బిల్లుకు పార్లమెంట్ ఆమోదం

Webdunia
శుక్రవారం, 11 జూన్ 2021 (14:00 IST)
గూఢచర్యం కేసులో కుల్‌భూషణ్‌ జాదవ్‌కు పాకిస్థాన్ ఆర్మీ కోర్టు మరణదండన విధించిన సంగతి తెలిసిందే. అయితే ఇవాళ ఆ దేశ పార్లమెంట్ కీలక బిల్లును పాస్ చేసింది. పాకిస్థాన్ హైకోర్టులో తన అరెస్టును వ్యతిరేకిస్తూ అప్పీల్ చేసుకునే బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. 
 
రీవ్యూ అండ్ రీ కన్సిడరేషన్ బిల్లు 2020కి జాతీయ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అంతర్జాతీయ కోర్టు నియమావళి ప్రకారం జాదవ్ ఇక తన కేసును ఫైల్ చేసే అవకాశం ఉంటుంది. 51 ఏళ్ల మాజీ నేవీ అధికారి జాదవ్‌కు .. పాకిస్థాన్ మిలిటరీ కోర్టు 2017 ఏప్రిల్‌లో మరణశిక్షను ఖరారు చేసింది.
 
ఈ కేసులో అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఇండియా ఆశ్రయించింది. జాదవ్‌కు తన కేసును వాదించుకునే అవకాశం కల్పించాలని డిమాండ్ చేసింది. అయితే ఎటువంటి జాప్యం చేయకుండా జాదవ్ కోర్టును ఆశ్రయించే రీతిలో చర్యలు తీసుకోవాలని జూలై 2019లో అంతర్జాతీయ కోర్టు పాకిస్థాన్‌ను ఆదేశించింది. 
 
బిల్లుపై న్యాయశాఖ మంత్రి ఫారోగ్ నాసిమ్ మాట్లాడుతూ.. ఒకవేళ బిల్లును పాస్ చేయకుంటే, ఇండియా మళ్లీ యూఎన్ భద్రతా మండలిని ఆశ్రయించేదని, కోర్టు ధిక్కరణ కింద పాక్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసేదన్నారు. బిల్లును పాస్ చేయడం వల్ల పాకిస్థాన్ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందన్న అంశాన్ని ప్రపంచానికి చాటి చెప్పినట్లు ఆయన వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments