Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్టికల్ 370 ఎఫెక్ట్: కుల్‌భూషణ్‌ కేసుపై పాక్ ఆంక్షలు

Webdunia
గురువారం, 8 ఆగస్టు 2019 (21:50 IST)
గూఢచర్యం ఆరోపణలతో పాకిస్తాన్‌లో జైలులో శిక్ష అనుభవిస్తున్న భారత నౌకదళ రిటైర్ ఉద్యోగి కుల్‌భూషణ్ జాదవ్ కేసులో పాక్ మరోసారి తన వక్రబుద్ధి చూపించింది. జాదవ్ కేసులో భారత రాయబార కార్యాలయం నుంచి ప్రతిబంధకం లేని న్యాయ సహాయాన్ని పాకిస్తాన్ గురువారం తోసిపుచ్చింది.
 
జూలై నెలలో అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పును అనుసరించి జాదవ్‌ను భారత దౌత్యాధికారులు కలుసుకోవడానికి అంగీకరిస్తూనే.. తమ దేశ చట్టాల ప్రకారం మూడు నిబంధనలు పెడుతున్నట్లు పాక్ పేర్కొంది.
 
జాదవ్‌ను భారత అధికారులు కలిసే సమయంలో వారితో పాటు పాకిస్తాన్ అధికారి, సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని తెలిపింది. అయితే వీటిపై భారతదేశం అభ్యంతరం తెలిపింది.
 
వియన్నా ఒప్పందం ప్రకారం... విదేశాల్లో బందీలుగా ఉన్న వ్యక్తులను వారి మాతృదేశాలకు చెందిన అధికారులు ఏ ఆటంకం లేకుండా కలుసుకోవచ్చన్న నిబంధనను భారత్ ప్రస్తావించింది.
 
అంతర్జాతీయ న్యాయస్థానం మొట్టికాయలు వేసినప్పటికీ పాక్ వైఖరిలో మార్పు రాకపోవడం గమనార్హం. అయితే ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలోనే కుల్‌భూషణ్ వ్యవహారంలో ఆటంకాలు సృష్టిస్తోందని పలువురు నిపుణులు విశ్లేషిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veeramallu: ఈసారి డేట్ మారదు, ఇండస్ట్రీ రికార్డులు మారతాయి : దర్శకుడు జ్యోతికృష్ణ

Mahesh Babu: ఏ మాయ చేసావేలో మహేష్ బాబు నటించివుంటే ఎలా వుంటుంది?

Tamannaah: విజయ్‌తో బ్రేకప్ తర్వాత హ్యాపీగా వున్న తమన్నా.. ఫోటోలు వైరల్

Fish Venkat: ఫిష్​ వెంకట్​ మళ్ళీ అనారోగ్యంతో వెంటిలేటర్ పై చికిత్స !

HariHara : పులుల్ని వేటాడే బెబ్బులిగా హరిహరవీరమల్లు ట్రైలర్ ఆకట్టుకుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

Breakfast: స్కూల్స్‌కు వెళ్లే పిల్లలు బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే.. ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments