Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవయవ దానం చేసిన నవజాత శిశువు

Webdunia
శుక్రవారం, 20 అక్టోబరు 2023 (16:17 IST)
సూరత్‌లో ఓ నవజాత శిశువు అవయవ దానం చేయడం చర్చకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే.. అక్టోబరు 13న సూరత్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అమ్రేలికి చెందిన ఓ మహిళ మగబిడ్డను ప్రసవించింది. అయితే, ఆ శిశువులో ఎటువంటి కదలికలు లేకపోవడంతో వైద్యులు బ్రెయిన్ డెడ్‌తో మరణించినట్లు ధ్రువీకరించారు. 
 
ఈ విషయం తెలుసుకున్న స్వచ్ఛంద సంస్థ జీవన్‌దీప్‌ ఆర్గాన్‌ డొనేషన్‌ ఫౌండేషన్‌ (జేఓడీఎఫ్‌) మేనేజింగ్‌ ట్రస్టీ విపుల్‌ తలావియా.. శిశువు తల్లిదండ్రులను కలిసి.. అవయవదానం ప్రాధాన్యతను వారికి వివరించారు. దీంతో ఆ చిన్నారి అవయవాలను దానం చేయడానికి తల్లిదండ్రులు సమ్మతించారు. 
 
దేశంలో అత్యంత పిన్న వయసు అవయవదాతగా ఈ పసికందును చెబుతున్నారు. నవజాత శిశువు నుంచి రెండు కిడ్నీలు, రెండు కార్నియాలు, కాలేయం, ప్లీహాన్ని సేకరించారు. 
 
కార్నియాను సూరత్ ఐ బ్యాంకుకు..మూత్రపిండాలను అహ్మదాబాద్‌లోని కిడ్నీ రిసెర్చ్ సెంటర్‌కు, కాలేయాన్ని ఢిల్లీలోని లివర్ బైలరీ సైన్సెస్ ల్యాబొరేటరీకి తరలించారు. 
 
అనంతరం తొమ్మిది నెలల చిన్నారికి కాలేయాన్ని విజయవంతంగా అమర్చారు. కిడ్నీలను 13 ఏళ్లు, 15 ఏళ్ల చిన్నారులు ఇద్దరికి అమర్చి.. కొత్త జీవితాన్ని ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జియో సినిమా ప్రీమియంలో ఈనెల‌ 15న కుంగ్ ఫూ పాండా 4

డ్రగ్స్ - సైబర్ నేరాల అరికట్టేందుకు ప్రయత్నం : నిర్మాత దిల్ రాజు

ఆయన సినిమాలో పార్ట్ కావడం నా కల : హీరోయిన్ మాల్వి మల్హోత్రా

శ్రీకృష్ణుడి గొప్పతనం అంశాలతో తెరకెక్కిన ‘అరి’ విడుదలకు సిద్ధం

గీతా ఆర్ట్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ నిహారిక ఎన్ఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments