Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆపరేషన్ సిందూర్ ట్రైలర్ మాత్రమే.. ముందుంది రియల్ సినిమా : మంత్రి రాజ్‌నాథ్ వార్నింగ్

ఠాగూర్
శుక్రవారం, 16 మే 2025 (15:25 IST)
ఆపరేషన్ సిందూర్ కేవలం ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా ముందు ఉందని కేంద్ర రక్షణ శాఖామంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధం వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ఇరు దేశాలు తలపడ్డాయి కూడా. ఈ సైనిక చర్యలో పాకిస్థాన్ తీవ్రంగా నష్టపోయింది. ముఖ్యంగా, భారత్ ప్రయోగించిన బ్రహ్మోస్ క్షిపణుల దెబ్బకు పాకిస్థాన్ దిగివచ్చింది. కేవలం 23 నిమిషాల్లోనే పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. 
 
ఈ నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గుజరాత్ రాష్ట్రం భుజ్‌లో ఉన్న భారత వైమానిక స్థావరాన్ని శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఎయిర్ వారియర్స్, భద్రతా దళాలను ఉద్దేశించి రాజ్‌నాథ్ సింగ్ ప్రసంగించారు. ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదు. అందరూ ఇప్పటిదాకా చూసింది కేవలం ట్రైలర్ మాత్రమే. సరైన సమయం వచ్చినపుడు భారత సాయుధ దళాలు పూర్తి చిత్రాన్ని ప్రదర్శిస్తాయి అని ఆయన స్పష్టం చేశారు. 
 
తమ గడ్డపై ఉగ్రవాద శిబిరాలను పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేపదే నేరాలు చేసేవారిని ఎలాగైతే నిఘాలో ఉంచుతారో, అలాగే పాకిస్థాన్‌ను కూడా మేము ప్రొబేషన్‌లో ఉంచాం. కాల్పుల విరమణ అంటే చర్యలు పూర్తిగా ఆగిపోయినట్టు కాదు. ఒకవేళ పాకిస్థాన్ తన పద్దతులు మార్చుకోకుండా మళ్లీ దుస్సాహసాలకు పాల్పడితే మన దళాలు గట్టి గుణపాఠం చెబుతాయి. మళ్లీ చెబుతున్నాం.. ఈసారి దాడి మరింత తీవ్రంగా ఉంటుంది అని రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రూ.28 కోట్లు పెట్టి చిత్రాన్ని తీస్తే రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది...

కంగ్రాట్స్ అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్యా, నువ్వు టాలీవుడ్ టాప్ హీరోయిన్ అవ్వాలి

Pawan: హరిహరవీరమల్లుకు డేట్ ఫిక్స్ చేసిన పవన్ కళ్యాణ్

NTR: ఎన్.టి.ఆర్. వార్ 2 గురించి హృతిక్ రోషన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

చైనా ఉత్పత్తులను కొనడం మానేద్దాం.. మన దేశాన్ని ఆదరిద్దాం : రేణూ దేశాయ్ పిలుపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments