Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎక్కడైనా రేషన్ : ఒక దేశం.. ఒకే రేషన్ కార్డు : విత్తమంత్రి

Webdunia
గురువారం, 14 మే 2020 (21:35 IST)
దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత అనేక సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఒకే తరహా పన్ను విధానమైన జీఎస్టీకి శ్రీకారం చుట్టారు. అలాగే, ఒకే దేశం.. ఒకే రేషన్ కార్డు విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఈ విధానం వచ్చే యేడాది మార్చి 31వ తేదీ నాటికి అమల్లోకి తీసుకొస్తామని కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
 
కరోనా సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ప్రధాని మోడీ రూ.20 లక్షల కోట్లతో ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ పేరుతో ప్రత్యేక ప్యాకేజీని ప్రవేశపెట్టారు. ఈ ప్యాకేజీ వివరాలను నిర్మలా సీతారామన్ గురువారం కూడా వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వచ్చే మార్చి కల్లా దేశం మొత్తానికి ఒకే రేషన్‌ కార్డు ఉండేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు.
 
రేషన్‌ కార్డులు కలిగి ఉన్నవారు 2021 మార్చి నుంచి దేశంలోని ఏప్రాంతం నుంచైనా రేషన్‌ సరుకులు పొందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యంగా వలసకార్మికులు ఇతర ప్రాంతాలకు పని నిమిత్తం వెళ్లినప్పుడు రేషన్‌ తీసుకోలేకపోతున్నందున వాళ్లు చాలా నష్టపోతున్నారన్నారు. 
 
ప్రధానమంత్రి సాంకేతిక ఆధారిత వ్యవస్థ సంస్కరణలో భాగంగా తీసుకొచ్చిన ఈ కొత్త విధానంతో 23 రాష్ట్రాల్లోని 67 కోట్ల మందికి ప్రయోజనం చేకూరుతుందని విత్త మంత్రి నిర్మలా సీతారమన్ చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments