Webdunia - Bharat's app for daily news and videos

Install App

వచ్చే జూన్ నుంచి ‘ఒక దేశం-ఒకే రేషన్ కార్డు’

Webdunia
బుధవారం, 4 డిశెంబరు 2019 (06:18 IST)
జాతీయ ఆహార భద్రత చట్టం ప్రకారం అర్హులైన లబ్ధిదారులు దేశంలో ఎక్కడైనా ఆహార ధాన్యాలను పొందేందుకు కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించబోతోంది. దీనికోసం ‘ఒక దేశం-ఒకే రేషన్ కార్డు’ పథకాన్ని 2020 జూన్ 1 నుంచి అమలు చేయబోతోంది.

కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ మంగళవారం లోక్‌సభకు తెలిపిన వివరాల ప్రకారం... ఈ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత అర్హులైన లబ్ధిదారులు తమ రేషన్ కార్డును ఉపయోగించి, తమకు అర్హతగల ఆహార ధాన్యాలను దేశంలోని ఏ ప్రాంతంలోని చౌక ధరల దుకాణం నుంచి అయినా పొందవచ్చు.
 
ఉపాధి కోసం వివిధ ప్రాంతాలకు వలస వెళ్ళేవారికి ఇబ్బంది లేకుండా ఆహార ధాన్యాలు అందుబాటులో ఉంచడం కోసం ‘ఒక దేశం-ఒకే రేషన్ కార్డు’ పథకాన్ని రూపొందించారు.

ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ ద్వారా లబ్ధిదారు బయోమెట్రిక్/ఆధార్‌ను ధ్రువీకరించిన తర్వాత ఈ పథకం అందుబాటులోకి వస్తుంది. పూర్తి స్థాయిలో ఈపీఓఎస్ పరికరాలు ఉన్న చౌక ధరల దుకాణాల్లో మాత్రమే ఈ పథకం అమలవుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం
Show comments