Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోర్టు హాలులో కాల్పులు.. మహిళా లాయర్‌కు తీవ్రగాయాలు, ముగ్గురు మృతి

Webdunia
శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (16:55 IST)
ఢిల్లీ రోహిణి కోర్టు హల్‌లో జరిగిన 'గ్యాంగ్ వార్' లో మొత్తం నలుగురు మరణించారు. 'మోస్ట్ వాంటెడ్' గ్యాంగ్ స్టర్ జితేంద్ర, అలియాస్ గోగి పై టిల్లు గ్యాంగ్ మనుషులు కాల్పులు జరపగా గోగి అక్కడికక్కడే మృతి చెందాడు. గోగి పై దాడికి పాల్పడిన టిల్లు గ్యాంగ్‌కు చెందిన దుండగులపై ఢిల్లీ 'స్పెషల్ సెల్' సాయుధ పోలీసులు కాల్పులు జరపడంతో వారిలో ముగ్గురు మరణించారు. 
 
శుక్రవారం మధ్యాహ్నం 2.34 గంటలకు కోర్టు నెంబర్ 2 హాలులోనే ఈ కాల్పులు జరిగాయి. న్యాయవాదుల వేషధారణలో ఉన్న టిల్లు గ్యాంగ్‌కు చెందిన దుండగులు ఈ కాల్పులకు పాల్పడ్డారు. ఈ రెండు గ్యాంగుల మధ్య సుదీర్ఘకాలంగా ఉన్న వైరం ఉంది. గ్యాంగ్ స్టర్ గోగితో సహా దాడికి పాల్పడిన ముగ్గురు మృతి చెందగా. మరో ముగ్గురికి గాయాలు కావడంతో హుటాహటిన ఆసుపత్రికి తరలించారు.
 
ఈ కోర్టు కాల్పుల ఘటనలో మహిళా లాయర్‌కు తీవ్ర గాయాలైనట్టు సమాచారం. గ్యాంగ్‌స్టర్ జితేందర్‌ను ఓ కేసు విషయంలో పోలీసులు రోహిణి కోర్టుకు తీసుకొచ్చారు. ఆ సమయంలో లాయర్ దుస్తుల్లో వచ్చిన కొందరు దుండగులు రూమ్ నెంబర్ 207 వద్ద కాల్పులు జరిపారు. పోలీసులు కూడా దుండగులపై ఎదురు కాల్పులు జరిపారని, పోలీసులు, దుండగులు మధ్య జరిగిన ఈ ఎదురు కాల్పుల్లో ఓ మహిళా లాయర్‌కు తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. ొొొొొొ 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan: పెద్ది లో కొత్త లుక్ లో రామ్ చరణ్ ను చూపించనున్న స్టైలిస్ట్ ఆలీం హకీం

బరాబర్ ప్రేమిస్తా’ నుంచి పాట విడుదల చేసిన బన్నీ వాస్

లిటిల్ హార్ట్స్ మూవీలో లైవ్ లీగా చూపించారు : అనిల్ రావిపూడి

రిషబ్ శెట్టి మూవీ కాంతార చాప్టర్ 1 నుంచి గుల్షన్ దేవయ్య లుక్

కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో అర్జున్ చక్రవర్తి లాంటి సినిమా రాలేదు : నిర్మాత శ్రీని గుబ్బల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments