Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ రాష్ట్రంలో ఆన్‍‌లైన్ వివాహాలకు చట్టబద్ధత - కేరళ కోర్టు అనుమతి

Webdunia
శుక్రవారం, 24 డిశెంబరు 2021 (09:11 IST)
దేశంలో ఒమిక్రాన్ వైరస్ కలకలం రేపుతోంది. ఈ వైరస్ వ్యాప్తి వేగంగా సాగుతోంది. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఫలితంగా పలు కఠిన ఆంక్షలను అమలు చేయాలంటూ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ఆదేశించింది. ఈ నేపథ్యంలో కేరళ కోర్టు ఆన్‌లైన్ పెళ్లిళ్లకు అనుమతి ఇచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, కేరళకు చెందిన మహిళా న్యాయవాది రింటు థామస్ (25), అనంత కృష్ణన్ హరికుమార్ నాయర్‌లకు పెద్దలు పెళ్లి నిశ్చయించారు. వీరి వివాహం గురువారం జరగాల్సివుంది. కానీ ఒమిక్రాన్ రూపంలో ఈ పెళ్లికి ఆటంకం ఏర్పడింది. బ్రిటన్‌లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న నాయర్ బుధవారం స్వదేశానికి రావాల్సి వుండగా, ఒమిక్రాన్ ఆంక్షలు అమల్లో ఉండటంతో అతను రాలేక పోయారు. 
 
దీంతో రింటు కేరళ హైకోర్టును ఆశ్రయించారు. ఆన్‌లైన్‌లో వివాహం చేసుకునేందుకు అనుమతించేలా రాష్ట్ర ప్రభుత్వం, తిరువనంతపురంలోని సబ్‌రిజిస్ట్రార్‌లను అనుమతించాలని అభ్యర్థించారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి ఎన్.నగరేశ్ ఆమె వినితిని అంగీకరించారు.
 
కరోనా సమయంలో ఆన్‌లైన్ వివాహాలకు అనుమతిచ్చిన నేపథ్యంలో ఇపుడు కూడా దానిని అమలు చేయవచ్చని, అందువల్ల రింటు థామస్ పెళ్లికి తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments