Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాలు బయటపెట్టకుండానే బెంగుళూరు వైద్యుడికి ఒమిక్రాన్!!

Webdunia
శుక్రవారం, 3 డిశెంబరు 2021 (13:21 IST)
దేశంలో ఒమిక్రాన్ కేసులు రెండు వెలుగు చూశాయి. ఈ రెండు కేసులు కూడా బెంగుళూరులోనే నమోదయ్యాయి. వీరిలో ఒకరు వైద్యుడు. మరొకరు విదేశస్థుడు. ఈ వైరస్ సోకిందని తెలియగానే విదేశస్థుడు తన దేశానికి వెళ్లిపోయాడు. అయితే, బెంగూళూరు డాక్టరు మాత్రం ప్రభుత్వ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. పైగా, ఈయన్ను కలిసిన మరో ఐదుగురికి కరోనా పాజిటివ్ అని తేలింది. వీరందరి ఆరోగ్యం బాగానే ఉంది. 
 
ఈ నేపథ్యంలో బెంగుళూరు వైద్యుడికి ఒమిక్రాన్ వైరస్ ఎలా సోకిందన్న అంశంపై ఇపుడు చర్చ సాగుతోంది. ఆయనకు ఈ మధ్య కాలంలో ఇతర ప్రాంతాలకు ఎక్కడికీ ప్రయాణించలేదు. ఆయన ఎక్కడుకు వెళ్లకుండానే ఒమిక్రాన్ వైరస్ సోకింది. గత నెల 21వ తేదీన ఈ వైద్యుడుకి జ్వరం, ఒళ్లు నొప్పులు ఉన్నాయి. మరుసటి రోజు ఆర్టీపీసీఆర్ టెస్టుల అతిడికి పాజిటివ్ అని తేలింది. 
 
ఆ తర్వాత ఆయన శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్స్ పరీక్షకు ఈ నెల 24వ తేదీన పంపించారు. మూడు రోజుల తర్వాత అంటే గత నెల 27వ తేదీన ఆయన్ను డిశ్చార్జ్ చేశారు. అయితే, ఈ వైద్యుడు శాంపిల్స్‌కు జరిపిన పరీక్షల్లో ఒమిక్రాన్ సోకినట్టు తేలింది. పైగా, ఈయన ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేకుండానే ఒమిక్రాన్ సోకిందని బృహత్ బెంగుళూరు మహానగర పాలిక (బీబీఎంపీ) రికార్డులు వెల్లడిస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments