లోక్‌సభ స్పీకరుగా ఓం బిర్లా ఎన్నిక.. ప్రొటెం స్పీకర్ ప్రకటన

వరుణ్
బుధవారం, 26 జూన్ 2024 (11:40 IST)
లోక్‌సభ స్పీకరుగా ఓం బిర్లా మరోమారు ఎన్నికయ్యారు. 18వ లోక్‌సభ స్పీకర్ కోసం బుధవారం జరిగిన ఎన్నికల్లో ఆయన మరోమారు గెలుపొందారు. ఈ విషయాన్ని ప్రొటెం స్పీకర్ భర్తృహరి అధికారికంగా వెల్లడించారు. మూజువాణి ఓటుతో ఆయన గెలుపొందినట్టు ప్రొటెం స్పీకర్ ప్రకటించారు. ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ, లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీలు మర్యాదపూర్వకంగా ఓం బిర్లాను స్పీకర్ చైర్ వరకు తోడ్కొనివెళ్లారు. స్పీకర్ చైరులో కూర్చుని వరుసగా రెండోసారి ఆయన బాధ్యతలు స్వీకరించారు. 
 
రాజస్థాన్ రాష్ట్రంలోని కోట స్థానం నుంచి ఆయన ఎన్నికయ్యారు. వరుసగా అక్కడి నుంచే ఆయన మూడోసారి విజయం సాధించి సభలో అడుగుపెట్టారు. గత 17వ లోక్‌‍సభలో ఆయన స్పీకర్‌గా సేవలు అందించారు. ముఖ్యంగా డిప్యూటీ స్పీకర్ లేకుండానే ఆయన సభను నడిపించి చరిత్ర సృష్టించారు. మరోవైపు, మరోమారు స్పీకర్‌గా ఎన్నికైన ఓం బిర్లాకు ప్రధాని మోడీ, విపక్ష నేత రాహుల్ గాంధీలు శుభాకాంక్షలు తెలిపారు. 
 
జగన్ ఓ అరాచకవాది .. కాంగ్రెస్‌తో చేరి మోడీ సర్కారును అస్థిపరిచేందుకు కుట్ర : బీజేపీ ఎమ్మెల్యే 
 
ఏపీలోని అనపర్తి నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ ఓ అరాచకవాది అని ఆయన కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారును అస్థిరపరిచేందుకు కుట్ర పన్నుతున్నాడని ఆరోపించారు. ఇందుకోసం ఆయన కాంగ్రెస్ పార్టీ నేతలతో మంతనాలు జరుపుతున్నారన్నారు. అవసరమైతే తమ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేందుకు సైతం సిద్ధంగా ఉన్నారన్నారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, జగన్ వైసీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, బెంగళూరులో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో దీనిపై చర్చలు జరిపారని తెలిపారు. 'జగన్ పాలనలో 2019 నుంచి 2024 వరకు అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగింది. ఆ అప్రకటిత ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ ప్రజలు కూటమికి అపూర్వ విజయాన్ని అందించారు. ఎప్పుడైనా సరే ప్రజలు నియంత పాలనను అంగీకరించరు అని దీని ద్వారా తెలుసుకోవచ్చన్నారు. 
 
అందుకే ఇవాళ దిక్కులేని పరిస్థితుల్లో జగన్ మోహన్ రెడ్డి తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే దిశగా అడుగులేస్తున్నాడు. మంగళవారం బెంగళూరులో డీకే శివకుమార్‌ను కలిసి మాట్లాడాడు. వైఎస్ షర్మిలను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి పంపిస్తే తమ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేందుకు సంసిద్ధం అని ప్రతిపాదించే నిస్సహాయ స్థితికి చేరాడు. వైసీపీ తరపున 11 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే, అందులో ఎంతమంది తనతో ప్రయాణం చేస్తారో తెలియని పరిస్థితి! నలుగురు ఎంపీలు గెలిస్తే, వారిలో ఎంతమంది తనతో కలిసి వస్తారో తెలియదు! ఉన్న రాజ్యసభ సభ్యులు ఇక ముందు కూడా తనతోనే ఉంటారో, ఉండరో తెలియని పరిస్థితిలో ఆయన కొట్టుమిట్టాడుతున్నారని పేర్కొన్నారు. 
 
అంతెందుకు... పులివెందులకు వెళితే అక్కడ కార్యకర్తలే తన ఇంటిపై దాడి చేస్తే జగన్ నిస్సహాయ స్థితిలో పడిపోయాడు. కడప జిల్లాలో గెలిచిన వైసీపీ అభ్యర్థులు కానీ, ఓడిన అభ్యర్థులు కానీ కడప రాజప్రాసాదం వైపు చూడని పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ కాంగ్రెస్ పార్టీని ఆశ్రయించే దిశగా ముందుకు వెళుతున్నాడు. ఇలాంటి అరాచక శక్తులన్నీ మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరి నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని అస్థిర పరిచే అవకాశముంది' అని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యాలకు, వారణాసి టైటిల్ పై రాజమౌళి కు చెక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

ప్రియదర్శి, ఆనంది ల ఫన్ రొమాన్స్ చిత్రం ప్రేమంటే

విశాల్... మకుటం’ చిత్రానికి గ్రాండ్ క్లైమాక్స్ షూట్ పూర్తి

నా కాలికి దెబ్బ తగిలితే నిర్మాత చిట్టూరి సెంటిమెంట్ అన్నారు : అల్లరి నరేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments