Webdunia - Bharat's app for daily news and videos

Install App

కులాంతర వివాహాలు చేసుకునే వారికి గుడ్ న్యూస్..

Webdunia
బుధవారం, 28 అక్టోబరు 2020 (12:30 IST)
కులాంతర వివాహాలు చేసుకునే వారికి గుడ్ న్యూస్. కులాంతర వివాహాలను ప్రోత్సహించే దిశగా ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం కొత్త చర్యలు చేపట్టింది. కులాంతర వివాహాలు చేసుకునేవారు సర్కారు ప్రోత్సాహకం కోసం దరఖాస్తు చేసుకునేందుకు సుమంగళ్ పేరిట ఓ వెబ్‌సైట్‌ను ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రారంభించారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ సుమంగళ్ పోర్టల్‌ను అభివృద్ధి చేసింది. 
 
కులాంతర వివాహాలు చేసుకున్న జంటలకు ఇచ్చే ప్రోత్సాహకం లక్ష రూపాయల నుంచి రెండున్నర లక్షల రూపాయలకు పెంచామని సీఎం నవీన్ పట్నాయక్ ప్రకటించారు. గతంలో రూ.50వేలున్న అంతర్ కుల వివాహ ప్రోత్సాహకాన్ని 2017లో లక్షరూపాయలకు పెంచింది. ప్రస్థుతం దీన్ని రెండున్నర లక్షల రూపాయలకు పెంచింది. కులాంతర వివాహాలు సామాజిక సామరస్యానికి దోహదపడతాయని సీఎం చెప్పారు.
 
ఉన్నత కులానికి చెందిన వారు షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారిని హిందూ వివాహ చట్టం ప్రకారం వివాహం చేసుకుంటే వన్ టైమ్ ప్రోత్సాహకం అందిస్తామని సర్కారు వెల్లడించింది. మొదటిసారి వివాహం చేసుకున్న వారికి మాత్రమే ఈ గ్రాంట్ ఇస్తామని, అయితే వధువు వితంతువు అయితే వారు ప్రోత్సాహకానికి అర్హులని సర్కారు పేర్కొంది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం