Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎనిమిదో తరగతి బాలికపై హెడ్మాస్టర్ అత్యాచారం...

Webdunia
శుక్రవారం, 6 సెప్టెంబరు 2019 (09:16 IST)
ఒడిషా రాష్ట్రంలో వినాయక చవితి రోజున ఓ బాలికపై అత్యాచారం జరిగింది. పాఠాలు చెప్పాల్సిన బడి పంతులే ఈ దారుణానికి పాల్పడ్డాడు. పైగా, ఆయనో స్కూలు హెడ్మాస్టర్. బాధిత బాలిక అతనివద్ద ఎనిమిదో తరగతి చదువుతోంది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఒడిశా రాష్ట్రంలోని బుధ్‌ఘడ్ గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాల ఉంది. ఇక్కడ గణేష్ చతుర్థి సందర్భంగా పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజ చేశారు. 
 
ఈ పూజలో పాల్గొనేందుకు వచ్చిన బాలికల్లో ఎనిమిదో తరగతి చదివే ఓ బాలిక కూడా ఉంది. పూజా కార్యక్రమం ముగిసిన తర్వాత ఈ మైనర్ బాలికను హెడ్మాస్టర్ తన గదిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
ఈ లైంగిక దాడి ఘటనను ఆ బాలిక తల్లిదండ్రులతో పాటు.. గ్రామస్థులకు చెప్పింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హెడ్మాస్టర్ పరారీలో ఉన్నాడు. బాలికను లైంగికంగా వేధించిన హెడ్మాస్టరుపై పోస్కో, ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న హెడ్మాస్టర్ కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం