Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎనిమిదో తరగతి బాలికపై హెడ్మాస్టర్ అత్యాచారం...

Webdunia
శుక్రవారం, 6 సెప్టెంబరు 2019 (09:16 IST)
ఒడిషా రాష్ట్రంలో వినాయక చవితి రోజున ఓ బాలికపై అత్యాచారం జరిగింది. పాఠాలు చెప్పాల్సిన బడి పంతులే ఈ దారుణానికి పాల్పడ్డాడు. పైగా, ఆయనో స్కూలు హెడ్మాస్టర్. బాధిత బాలిక అతనివద్ద ఎనిమిదో తరగతి చదువుతోంది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఒడిశా రాష్ట్రంలోని బుధ్‌ఘడ్ గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాల ఉంది. ఇక్కడ గణేష్ చతుర్థి సందర్భంగా పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజ చేశారు. 
 
ఈ పూజలో పాల్గొనేందుకు వచ్చిన బాలికల్లో ఎనిమిదో తరగతి చదివే ఓ బాలిక కూడా ఉంది. పూజా కార్యక్రమం ముగిసిన తర్వాత ఈ మైనర్ బాలికను హెడ్మాస్టర్ తన గదిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
ఈ లైంగిక దాడి ఘటనను ఆ బాలిక తల్లిదండ్రులతో పాటు.. గ్రామస్థులకు చెప్పింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హెడ్మాస్టర్ పరారీలో ఉన్నాడు. బాలికను లైంగికంగా వేధించిన హెడ్మాస్టరుపై పోస్కో, ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న హెడ్మాస్టర్ కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం