Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒరిస్సా మహిళలకు శుభవార్త... ఒక రోజు నెలసరి సెలవు పాలసీ...

ఠాగూర్
శుక్రవారం, 16 ఆగస్టు 2024 (15:22 IST)
ఒరిస్సా మహిళలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఒక రోజు నెలసరి సెలవు విధానాన్ని ప్రవేశపెడుతున్నట్టు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రకటించింది. ఉద్యోగినులకు నెలసరి సమయంలో తొలిరోజు లేదా రెండో రోజు సెలవు ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ప్రభాతి పరిడ వెల్లడించారు.
 
ఇది ఉద్యోగాలు చేస్తున్న మహిళలందరికీ వర్తిస్తుందన్నారు. గురువారం కటక్‌లో జరిగిన ఇండిపెండెన్స్ డే వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న డిప్యూటీ సీఎం ఈ మేరకు మీడియాతో మాట్లాడుతూ కీలక ప్రకటన చేశారు. ఉద్యోగుల ఆరోగ్యం, శ్రేయస్సును కాంక్షిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. 
 
దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉద్యోగినులు ప్రభుత్వ నిర్ణయం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే సామాజిక కార్యకర్త నమ్రతా చద్దా కూడా హర్ష వ్యక్తం చేశారు. మరోవైపు ప్రస్తుతం బీహార్, కేరళ ప్రభుత్వాలు మాత్రమే మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవులు ఇస్తున్నాయి.
 
ప్రభుత్వాలతో పాటు కొన్ని యూనివర్సిటీలు కూడా నెలసరి సెలవులను ప్రకటించాయి. వాటిల్లో హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్శిటీ ఆఫ్ లా, తేజ్ పూర్, అస్సాంలోని గుహవాటి, చండీగఢ్‌ లోని పంజాబ్ యూనివర్సిటీల విద్యార్థినులకు నెలసరి సెలవులు ప్రకటించాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments