Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇద్దరు మహిళా రోగులపై వైద్యుడి అఘాయిత్యం... ఎక్కడ?

ఠాగూర్
మంగళవారం, 13 ఆగస్టు 2024 (22:26 IST)
ఎకోకార్డియోగ్రామ్ వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి వచ్చిన ఇద్దరు మహిళా రోగులపై ఆస్పత్రిలోనే ఓ కామాంధ వైద్యుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ దారుణం ఒరిస్సా రాష్ట్రంలోని కటక్‌లో వెలుగు చూసింది. రోగుల ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంబంధిత వైద్యుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఒరిస్సా రాష్ట్రంలోని కటక్ నగరంలో ఎస్సీబీ మెడికల్ కాలేజీ అడం ఆస్పత్రి ఉంది. ఇక్కడికి ఇద్దరు మహిళా రోగులు ఎకోకార్డియోగ్రామ్ వైద్య పరీక్షల కోసం ఆదివారం వచ్చారు. వీరికి వైద్య పరీక్షల నిమిత్తం గదికి తీసుకెళ్లిన ఓ రెసిడెంట్ వైద్యుడు అఘాయిత్యానికి పాలపడ్డాడు. దీనిపై బాధిత మహిళలు ఇద్దరూ మంగలాబాద్ పోలీస్ స్టేషన్‌లో సోమవారం లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. 
 
దీంతో కేసు నమోదు చేసినట్టు కటక్ అడిషినల్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ అనిల్ మిశ్రా తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు కోసం ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసిందని వివరించారు. ఈ కమిటీలో ముగ్గురు సభ్యులు ఉన్నారని తెలిపారు. కాగా, నిందిత వైద్యుడిని రోగుల బంధువులు చితకబాదారని, అయితే, వైద్యుడి నుంచి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని అనిల్ మిశ్రా వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంతాన ప్రాప్తిరస్తు నుంచి విక్రాంత్, చాందినీ చౌదరి ల రొమాంటిక్ సాంగ్

ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు జంటగా బైలింగ్వల్ చిత్రం

Nitin: సోలోడేట్ లోనే రాబిన్‌హుడ్ అనుకున్నాం, కానీ పోటీ తప్పదనే రావాల్సివచ్చింది : చిత్ర టీమ్

Warner: క్రికెట్‌లో స్లెడ్జింగ్‌ కంటే ఆ కామెంట్స్ పెద్దవేమీ కాదు.. లైట్‌గా తీసుకున్న వార్నర్.. వెంకీ

'కన్నప్ప'కు పోటీగా 'భైరవం' - వెండితరపైనే చూసుకుందామంటున్న మనోజ్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

తర్వాతి కథనం
Show comments