Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇద్దరు మహిళా రోగులపై వైద్యుడి అఘాయిత్యం... ఎక్కడ?

ఠాగూర్
మంగళవారం, 13 ఆగస్టు 2024 (22:26 IST)
ఎకోకార్డియోగ్రామ్ వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి వచ్చిన ఇద్దరు మహిళా రోగులపై ఆస్పత్రిలోనే ఓ కామాంధ వైద్యుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ దారుణం ఒరిస్సా రాష్ట్రంలోని కటక్‌లో వెలుగు చూసింది. రోగుల ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంబంధిత వైద్యుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఒరిస్సా రాష్ట్రంలోని కటక్ నగరంలో ఎస్సీబీ మెడికల్ కాలేజీ అడం ఆస్పత్రి ఉంది. ఇక్కడికి ఇద్దరు మహిళా రోగులు ఎకోకార్డియోగ్రామ్ వైద్య పరీక్షల కోసం ఆదివారం వచ్చారు. వీరికి వైద్య పరీక్షల నిమిత్తం గదికి తీసుకెళ్లిన ఓ రెసిడెంట్ వైద్యుడు అఘాయిత్యానికి పాలపడ్డాడు. దీనిపై బాధిత మహిళలు ఇద్దరూ మంగలాబాద్ పోలీస్ స్టేషన్‌లో సోమవారం లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. 
 
దీంతో కేసు నమోదు చేసినట్టు కటక్ అడిషినల్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ అనిల్ మిశ్రా తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు కోసం ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసిందని వివరించారు. ఈ కమిటీలో ముగ్గురు సభ్యులు ఉన్నారని తెలిపారు. కాగా, నిందిత వైద్యుడిని రోగుల బంధువులు చితకబాదారని, అయితే, వైద్యుడి నుంచి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని అనిల్ మిశ్రా వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Keneesha: రవి మోహన్ ప్రేయసి కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంటా?

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments