Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాకు చేదు అనుభవం.. కాన్వాయ్‌పై కోడిగుడ్ల దాడి

Webdunia
ఆదివారం, 31 అక్టోబరు 2021 (15:34 IST)
ఆదివారం బీహార్ రాష్ట్ర పర్యటనకు వెళ్లిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రాకు చేదు అనుభవం ఎదురైంది. ఆదివారం భువనేశ్వర్‌లోని బిజూ పట్నాయక్‌ అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల ఆయన కాన్వాయ్‌పైకి ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు కోడిగుడ్లు విసిరారు. అయితే, కార్యకర్తలు పోలీస్ భద్రతా బలగాల నుంచి నుంచి తప్పించుకొని మంత్రి కాన్వాయ్‌పై గుడ్లు విసిరారు. 
 
కటక్‌లోని ముండులిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన ఒడిశాకు రాగా.. మంత్రికి వ్యతిరేకంగా ఎన్‌యూఎస్‌యూ నేతలు నల్లజెండాలను ప్రదర్శించగా.. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. అక్టోబర్‌ 3న ఉత్తర్‌ప్రదేశ్‌ అఖింపూర్‌ ఖేరిలో చెలరేగిన హింసాకాండ నేపథ్యంలో.. మంత్రి కుమారుడు ఆశిష్‌ మిశ్రాను 9న పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
 
మంత్రి కాన్వాయ్‌లోని ఓ వాహనం వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారిపైకి దూసుకెళ్లగా.. నలుగురు రైతులు సహా ఎనిమిది మంది మృతి చెందారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మంత్రి, ఆయన కుమారుడిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫిల్మ్‌ఫేర్ గ్లామర్- స్టైల్ అవార్డ్స్ 2025తో బ్లెండర్స్ ప్రైడ్

Emraan Hashmi: పవన్ కళ్యాణ్ ఓజీ నుండి థమన్ స్వరపరిచిన ఓమి ట్రాన్స్ విడుదల

Tej sajja: చిరంజీవి, కరణ్ జోహార్, నాని గారి కాంప్లిమెంట్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది : తేజ సజ్జా

Shiva Kandukuri: చాయ్ వాలా మొదటి సింగిల్ సఖిరే లిరికల్ విడుదలైంది

Rajendra Prasad: ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రం నేనెవరు : డా: రాజేంద్ర ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

Mushrooms: మష్రూమ్స్‌ను వండేటప్పుడు ఇలా శుభ్రం చేస్తున్నారా?

భార్య గర్భవతిగా వున్నప్పుడు భర్త చేయాల్సినవి

టొమాటో సూప్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మీరు మద్యం సేవిస్తున్నారా? అయితే, ఈ ఫుడ్ తీసుకోవద్దు

తర్వాతి కథనం
Show comments