Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముప్పు పొంచివుంటే తప్పక దాడి చేస్తాం .. అజిత్ ధోవల్ :: క్లారిటీ ఇచ్చిన కేంద్రం

Webdunia
సోమవారం, 26 అక్టోబరు 2020 (12:31 IST)
జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ చేసిన వ్యాఖ్యలు ఇపుడు చర్చనీయాంశంగా మారాయి. ఈ నెల 24న రిషికేశ్‌లోని పరమార్థ నికేతన్ ఆశ్రమంలో భక్తులను ఉద్దేశించి అజిత్ ధోవల్ మాట్లాడారు. 
 
ఈ సందర్భంగా భారతదేశ ఆధ్యాత్మికత గొప్పదనం గురించి చెప్పారు. ఏ దేశంపై కూడా మనం దాడి చేయలేదనే విషయం అందరికీ తెలుసని... కానీ, ఏ దేశం నుంచైనా మనకు ముప్పు పొంచి ఉంటే మాత్రం... మనం తప్పకుండా దాడి చేస్తామని చెప్పారు. మన దేశాన్ని కాపాడుకోవడానికి ఈ పని చేయాల్సిందేనని అన్నారు. 
 
ధోవల్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రకంపనలు పుట్టించాయి. లడఖ్ విషయంలో చైనాను ఉద్దేశించే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని వార్తలు వచ్చాయి. చైనాను ఉద్దేశించే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారంటూ పెద్ద ఎత్తున చర్చ తెరపైకి రావడంతో కేంద్రం కలుగజేసుకుంది. ఆధ్యాత్మిక ధోరణితో తన వ్యక్తిగత అభిప్రాయాలను మాత్రమే ధోవల్ చెప్పారని కేంద్రం తెలిపింది. ఏ ఒక్క దేశాన్ని ఉద్దేశించి ధోవల్ వ్యాఖ్యలు చేయలేదని క్లారిటీ ఇచ్చింది.

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments