Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్రీయ విద్యాలయాల్లో ఓబీసీలకు ప్రత్యేక కోటా.. ఆర్టీఈ సీట్లలో కోత

Webdunia
శుక్రవారం, 3 ఏప్రియల్ 2020 (16:37 IST)
దేశంలోని కేంద్రీయ విద్యాలయ, జవహర్ నవోదయ విద్యాలయాల్లో ప్రత్యేక కోటాను అమలు చేయనున్నారు. ఈ విద్యా సంవత్సరం (2020-21) నుంచి కేవీ, జేఎన్‌వీల్లో 27 శాతం ఓబీసీ కోటా రిజర్వేషన్‌ను అమలు చేయనున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న 1200 విద్యాలయాల్లో ఒకటో తరగతిలో ప్రవేశానికి ఈ కోటా అమలు కానుంది. 
 
ఈ మేరకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ... కేంద్రీయ విద్యాలయ సంగఠన్ (కేవీఎస్)కు లేఖ రాసింది. పాలసీ గురించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపింది. ఓబీసీల సంక్షేమం కోసం ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ గతేడాది డిసెంబర్లో ఇచ్చిన నివేదిక ఆధారంగా కోటాపై నిర్ణయం తీసుకున్నారు.
 
కేవీ అడ్మిషన్ పాలసీ ప్రకారం ప్రస్తుతం ఆర్టీఈ (రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్)కి 25 శాతం, ఎస్‌సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం సీట్లు కేటాయిస్తున్నారు. అలాగే, వికలాంగులకు మూడు శాతం కోటా ఉంది. దీంతో పాటు ఐదు సీట్లను డిఫెన్స్, రైల్వేస్, ప్రభుత్వ రంగం సంస్థలు సిఫారసు చేసిన వారికి ఇస్తున్నారు.
 
మొదటిసారి ఓబీసీ కేటగిరీని చేర్చడంతో పాటు అడ్మిషన్ గైడ్‌లైన్స్‌లో మార్పు చేస్తున్నట్టు కేవీలు, జేఎన్‌వీలకు రాసిన లేఖలో మంత్రిత్వ శాఖ పేర్కొన్నది. కొత్త నిబంధనల ప్రకారం ప్రతి స్కూల్‌ మొదటి తరగతిలో 10 సీట్లు ఆర్టీఈకి, ఆరు సీట్లు ఎస్‌సీలకు, మూడు సీట్లు ఎస్టీలకు, 11 సీట్లు ఓబీసీలకు కేటాయించాలని స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments