Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో 35శాతం రిజర్వేషన్లు

Webdunia
గురువారం, 5 అక్టోబరు 2023 (19:07 IST)
విధానసభ ఎన్నికలకు ముందు మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో మహిళలకు 35 శాతం రిజర్వేషన్లు ఖరారు చేస్తూ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో ఒక అటవీ శాఖకు మినహాయింపు ఉంది. ఈ మేరకు మధ్యప్రదేశ్ సివిల్ సర్వీసెస్ రూల్స్, 1997ని సవరించారు. 
 
"సర్వీస్ రూల్స్ ఉన్నప్పటికీ, మేము రాష్ట్ర సేవలో మహిళలకు (అటవీ శాఖ మినహా) అన్ని పోస్టులలో 35 శాతం రిజర్వ్ చేస్తున్నాము" అని నోటిఫికేషన్ పేర్కొంది.
 
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇటీవలే 35 శాతం పోలీసు, ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు మహిళలకు రిజర్వ్ చేయబడతాయని ప్రకటించారు. అయితే తాజా నోటిఫికేషన్‌లో, ఇది అన్ని ఉద్యోగాలకు వర్తింపజేయబడింది. 
 
అలాగే ‘లాడ్లీ బెహనా యోజన’ పథకం కింద అర్హులైన ప్రతి మహిళకు ఇచ్చే రూ.1,250 శుక్రవారం ఖాతాలో వేస్తామని, ఎన్నికల నోటిఫికేషన్ రాగానే ఇవ్వలేకపోయామని ముఖ్యమంత్రి చెప్పారు.

తెలంగాణ తరహాలోనే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుపై సంతకం చేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments