Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్

Webdunia
గురువారం, 23 మార్చి 2023 (07:41 IST)
దేశ వ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో కొత్త విద్యా సంవత్సరం 2023-24కు గాను వివిధ తరగతుల్లో ప్రవేశాలకు ప్రకటనను జారీ చేశారు. ఈ మేరకు కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌(కేవీఎస్‌) తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఒకటో తరగతి ప్రవేశాలకు సంబంధించి ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ మార్చి 27వ తేదీ ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమై ఏప్రిల్‌ 17వ తేదీ రాత్రి 7గంటల వరకు కొనసాగుతుందని తెలిపింది. ఒకటో తరగతిలో ప్రవేశం పొందాలనుకొనే చిన్నారుల వయస్సు మార్చి 31, 2023 నాటికి ఆరేళ్లు పూర్తి కావాల్సి ఉండాలని స్పష్టం చేసింది. ఈ వయస్సును నూతన జాతీయ విద్యా విధానం కింద ఆరేళ్లకు పెంచారు. 
 
కేవీల్లో సీటు కోసం ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వారి ప్రాథమిక /వెయిటింగ్‌ తొలి జాబితాను ఏప్రిల్‌ 20న విడుదల చేసి ఏప్రిల్‌ 21 నుంచి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించనున్నట్టు ప్రకటనలో పేర్కొంది. ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు రెండో, మూడో జాబితాలను ప్రకటించి అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేయనున్నారు. 
 
అలాగే, రెండు, ఆ పైతరగతుల్లో ఖాళీగా ఉండే సీట్లను భర్తీ చేసేందుకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ఏప్రిల్‌ 3వ తేదీన ఉదయం 8 గంటలకు ప్రారంభమై ఏప్రిల్‌ 12వ తేదీన సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతుందని తెలిపింది. పూర్తి వివరాలను https://kvsangathan.nic.in వెబ్‌సైట్‌ను చూసి తెలుసుకోవచ్చని పెర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నితిన్, శ్రీలీల నటించిన రాబిన్ హుడ్ చిత్రం రివ్యూ

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments