Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత సైనికులకు మతం వుండదండోయ్: ఓవైసీకి లెఫ్టినెంట్ జనరల్ ఝలక్

దేశం కోసం ముస్లింలు సైన్యంలో వుండి ప్రాణత్యాగం చేస్తున్నప్పటికీ.. తమను పాకిస్థానీయులనే ముద్ర వేస్తున్నారనంటూ ఎంఐఎం అధినేత అసదుద్ధీన్ ఓవైసీ మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపై సైన్యం ఘాటుగా స్పందించింది. సైనికుల

Webdunia
శుక్రవారం, 16 ఫిబ్రవరి 2018 (14:05 IST)
దేశం కోసం ముస్లింలు సైన్యంలో వుండి ప్రాణత్యాగం చేస్తున్నప్పటికీ.. తమను పాకిస్థానీయులనే ముద్ర వేస్తున్నారనంటూ ఎంఐఎం అధినేత అసదుద్ధీన్ ఓవైసీ మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపై సైన్యం ఘాటుగా స్పందించింది. సైనికులను తాము మత కోణంలో ఎన్నడూ చూడలేదని ఆర్మీ ఉత్తర విభాగం లెఫ్టినెంట్ జనరల్ దేవరాజ్ అన్భు స్పష్టం చేశారు. 
 
మీలాంటి వాళ్లే ఆ పని చేస్తున్నారంటూ దేవరాజ్ పరోక్షంగా నిప్పులు చెరిగారు. అమరవీరులకు మతం రంగు పులిమి లబ్ధి పొందాలనుకుంటున్నారని చురకలంటించారు. భారత సైనికులకు మతం వుండదనే విషయం వారికి తెలియకపోవచ్చునని.. వారి దేశభక్తిని వారి విజ్ఞతకే వదిలేస్తున్నట్లు చెప్పారు. 
 
కాగా సంజువాన్‌లో జరిగిన ఉగ్రదాడిలో వీరమరణం పొందిన జవాన్లలో ఐదుగురు ముస్లింలు వున్నారని చెప్పిన ఓవైసీ.. దేశం పట్ల ముస్లింలకు ఉన్న ప్రేమ, చిత్తశుద్ధిని ప్రశ్నించేవారికి ఈ ఉదంతం ఒక కనువిప్పు కావాలంటూ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైనాయి. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments