Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.కోట్ల ఆస్తి కోసం చనిపోయిన తల్లిని ఏం చేశాడంటే...

Webdunia
బుధవారం, 19 డిశెంబరు 2018 (10:58 IST)
కొందరు విచక్షణ మరిచి ఆస్తిపాస్తుల కోసం చేయరాని పనులు చేస్తున్నారు. రూ.285 కోట్ల ఆస్తి కోసం ఏకంగా చనిపోయిన తల్లిని బతికివున్నట్టుగా చూపించాడో వ్యక్తి. ఈ విషయం అతని సోదరుడు ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. 
 
గత 2011 మార్చి నెల ఏడోతేదీన సునీల్ గుప్తా తల్లి కమలేష్ రాణి చనిపోయింది. ఈమె పేరిట ఓ కొవ్వొత్తుల తయారీ కంపెనీ సహా మొత్తం రూ.285 కోట్ల విలువైన ఆస్తివుంది. ఈ ఆస్తిపై కన్నేసిన ఆమె పెద్ద కుమారుడు సునీల్ గుప్తా దానిని తల్లి తన పేరున బదలాయించినట్టు నకిలీ పత్రాలు సృష్టించాడు. 
 
నిజానికి ఆమె చనిపోయిన తర్వాత ఆస్తిని తాము సమానంగా పంచుకోవాల్సి ఉందని, కానీ సోదరుడు సునీల్ దుర్బుద్ధితో ఆస్తిని కాజేయాలని చూశాడు. ఈ విషయం పసిగట్టిన అతని సోదరుడు విజయ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫోర్జరీ సంతకాలతో ఆస్తిని కాజేయాలని చూస్తున్నాడని ఆరోపిస్తూ కోర్టుకెక్కాడు. 
 
విచారించిన కోర్టు సునీల్ గుప్తాపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. దీంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన నోయిడా పోలీసులు సునీల్ గుప్తా, ఆయన భార్య రాధ, కుమారులను అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టారు. అనంతరం జైలుకు తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కొత్త ఆరంభం' అంటున్న గాయకుడు రాహుల్ సిప్లిగంజ్

ఏంటయ్యా ఇది.. హీరోలైనా వరకట్నం కోసం వేధిస్తారా? హీరో ధర్మ మహేష్‌పై కేసులు

Court : రహస్యంగా కోర్టు దర్శకుడి వివాహం.. వధువు ఎవరంటే?

ప్రభాస్‌తో స్నేహం వుంది: శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments