Webdunia - Bharat's app for daily news and videos

Install App

అబ్బే... ఒట్టిదే..! స్వర్ణం పన్నుపై కేంద్రం వివరణ

Webdunia
శుక్రవారం, 1 నవంబరు 2019 (08:15 IST)
పరిమితికి మించి బంగారం కలిగి ఉన్నవారిపై పన్ను, జరిమానా విధించే దిశగా మోదీ ప్రభుత్వం అడుగులు వేస్తోందన్న వార్తలను కేంద్ర ఆర్థిక శాఖ తోసిపుచ్చింది. ‘బంగారం క్షమాభిక్ష’ స్కీం అసలు పరిశీలనలోనే లేదని తేల్చిచెప్పింది.

తమ వద్ద ఎంత బంగారం ఉందో చెప్పాలని మోదీ ప్రభుత్వం స్పష్టం చేయనుందని పలు పత్రికల్లో వార్తలు వచ్చాయి. పరిమితికి మించి ఉన్న బంగారంపై పన్ను విధించి.. ‘ఆమ్నెస్టీ’ (సార్వత్రిక క్షమాభిక్ష) కింద శిక్షించకుండా వదిలేస్తుందని.. తర్వాత కొరడా ఝళిపిస్తుందని.. లెక్కల్లో చూపించని బంగారంపై భారీ స్థాయిలో జరిమానాలు విధిస్తుందని.. ప్రాసిక్యూట్‌ కూడా చేయొచ్చని.. కొత్తగా కొన్న బంగారు కొనుగోళ్ల వివరాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి చెప్పాల్సి ఉంటుందని.

రశీదు లేకుండా బంగారం కొంటే భారీ జరిమానాలు తప్పవని సదరు కథనాల్లో పేర్కొన్నాయి. ఆదాయ పన్ను (ఐటీ) విభాగం ఈ స్కీమును గతంలోనే తిరస్కరించిందని.. తాజాగా నీతి ఆయోగ్‌, కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం దీనిని ప్రవేశపెట్టాలని గట్టిగా ప్రతిపాదిస్తున్నాయని వచ్చిన వార్తలను కేంద్ర ఆర్థిక శాఖ ఖండించింది. బడ్జెట్‌ ప్రక్రియ నడుస్తున్నప్పుడు ఇలాంటి ఊహాగానాలు రావడం సహజమేనని వ్యాఖ్యానించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments