Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ నెలాఖరు వరకు ఎయిర్‌ ఇండియా సేవలుండవ్

Webdunia
శనివారం, 4 ఏప్రియల్ 2020 (16:13 IST)
ఎయిర్‌ ఇండియా సంస్థ ఈ నెల 30వ తేదీ వరకు తమ సర్వీసులను తిరిగి ప్రారంభించబోమని స్పష్టం చేసింది. దేశీయ, విదేశీ మార్గాల్లో ఈ నెల 30 వరకు విమానాలు నడుపబోమని చెప్పింది.

మిగతా సంస్థలు మాత్రం ప్రభుత్వం నుంచి అనుమతి కోసం ఎదురు చూస్తున్నాయి. లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత ఆంక్షలు సడలిస్తారని, ఇందులో తమ సర్వీసులు కూడా ఉంటాయని భావిస్తున్నాయి. లాక్‌డౌన్‌ కారణంగా గత నెల 24 నుంచి విమాన సర్వీసులు నిలిపోయాయి.

వాటిని యథావిధిగా కొనసాగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర విమానయాన మంత్ర హర్దీప్‌ సింగ్‌పూరి రెండు రోజుల క్రితం ప్రకటించారు. లాక్‌డౌన్‌ కారణంగా అత్యవససర సేవలు మినహా దేశంలో అన్ని కార్యకలాపాలు ఆగిపోయాయి.

రవాణా వ్యవస్థ కూడా స్తంభించింది. గూడ్స్‌, నిత్యావసర సరుకులు, వైద్య సేవల కోసం మాత్రమే కొన్ని విమానాలు, రైళ్లు నడుస్తున్నాయి. ఈ నెల 14 వ తేదీతో లాక్‌డౌన్‌ పూర్తి కావడం, దాన్ని పొడిగించే అవకాశం లేదని ప్రభుత్వ వర్గాల సమాచారంతో దేశీయ విమాన సర్వీసులు మళ్లీ మొదలుకానున్నాయి.

ఈ నెల 15 వ తేదీ నుంచి సర్వీసులను పునరుద్ధరించాలని విమాయన సంస్థలు భావిస్తున్నాయి. కొన్ని సంస్థలు ఇప్పటికే బుకింగ్స్‌ను కూడా ప్రారంభించినట్టు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments